Homeక్రీడలుT20 World Cup Champions: భారత క్రికెటర్ల ఊర మాస్ స్టెప్పులు.. వీడియో వైరల్

T20 World Cup Champions: భారత క్రికెటర్ల ఊర మాస్ స్టెప్పులు.. వీడియో వైరల్

T20 World Cup Champions: దాదాపు 17 సంవత్సరాల తర్వాత టి20 వరల్డ్ కప్ ను టీమిండియా గెలుచుకుంది.. శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. విజయం అనంతరం ఆదివారం తెల్లవారుజామున టీమిండియా స్వదేశానికి తిరిగి రావాల్సి ఉండేది. విపరీతమైన వర్షాలు కురవడంతో బుధవారం తెల్లవారుజామున దాకా టీమిండియా ఆటగాళ్లు వెస్టిండీస్ లోని బార్బడోస్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది. వాతావరణం అనుకూలించిన తర్వాత నిన్న తెల్లవారుజామున ప్రత్యేక విమానంలో టీమిండియా ఆటగాళ్లు స్వదేశానికి బయలుదేరారు. గురువారం తెల్లవారు జామున 6 గంటలకు టీమిండియా ఆటగాళ్లు ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోహిత్ శర్మ, రోజర్ బిన్నీ, జై షా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా టి20 వరల్డ్ కప్ ట్రోఫీని శర్మ సగర్వంగా ప్రదర్శించాడు.

అభిమానుల కేరింతలతో ఢిల్లీ విమానాశ్రయం దద్దరిల్లిపోయింది. రోహిత్ విమానాశ్రయంలోకి ప్రవేశించగానే ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అభిమానుల కేరింతలతో ఆ ప్రాంతం మొత్తం సందడిగా మారింది. అభిమానుల ఉత్సాహాన్ని మరింత పెంచేలా రోహిత్ వరల్డ్ కప్ ట్రోఫీని పైకెత్తి చూపుతూ అభివాదం చేశాడు అనంతరం భారత క్రికెటర్లు ప్రత్యేక బస్సులు ఐటీసీ మౌర్య హోటల్ వెళ్లారు. అక్కడ కూడా భారత క్రికెటర్లకు ఘన స్వాగతం లభించింది. హోటల్ మౌర్య లోకి ప్రవేశించే మార్గంలో కళాకారుడు సాంప్రదాయ నృత్యాలు చేస్తూ టీమిండియా ఆటగాళ్లకు ఘన స్వాగతం పలికారు. డోలు చప్పులకు రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్ ఊర మాస్ డాన్స్ చేశారు. రోహిత్ వేసిన స్టెప్పులు సోషల్ మీడియాను ఒక ఊపు ఊపుతున్నాయి.

ఇక భారత క్రికెటర్లు ఐటిసి మౌర్య హోటల్లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసేందుకు ఆయన అధికారిక నివాసానికి బయలుదేరి వెళ్లారు. అక్కడ ప్రధానమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా క్రికెటర్లను ప్రధానమంత్రి వ్యక్తిగతంగా అభినందించారు. ప్రతి ఒక్కరితో కరచాలనం చేసి, భుజం తట్టి శభాష్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానితో భేటీ తర్వాత టీమిండియా ఆటగాళ్లు ఓపెన్ టాప్ బస్సులో ర్యాలీగా వెళ్తారు.. అనంతరం సాయంత్రం ముంబైలోని వాంఖడె మైదానం చేరుకున్నారు. అక్కడ క్రికెటర్లను బీసీసీఐ ఘనంగా సన్మానిస్తుంది.125 కోట్ల చెక్కును అందజేస్తుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Siddharth Emotional

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Oktelugu Epaper