spot_img
Homeక్రీడలుక్రికెట్‌RoKo is back: ROKO ఫామ్ లోకి వస్తే ఇలాంటి ఫలితాలే.. ఆస్ట్రేలియాకు సినిమా అర్థమైంది..

RoKo is back: ROKO ఫామ్ లోకి వస్తే ఇలాంటి ఫలితాలే.. ఆస్ట్రేలియాకు సినిమా అర్థమైంది..

RoKo is back: 2 వన్డేలు గెలిచింది. సిరీస్ సొంతం చేసుకుంది. మూడో వన్డే కూడా గెలిచి వైట్ వాష్ చేయాలని అనుకుంది. కానీ టీమిండియా అంత ఈజీగా ఆస్ట్రేలియా ముందు తలవంచలేదు. పైగా ఈసారి ఆస్ట్రేలియా సిడ్నీ వేదికగా టాస్ గెలిచి.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టుకు మరొక ఓటమి తప్పదని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు ఆస్ట్రేలియా మూడుసార్లు టాస్ గెలిచింది. తొలి రెండుసార్లు బౌలింగ్ ఎంచుకొని.. టీమిండియాను ఇబ్బంది పెట్టింది. అయితే మూడోసారి బ్యాటింగ్ ఎంచుకోవడంతో సిడ్నీ మైదానంలో పరుగుల వరద పారుతుందని అందరూ అనుకున్నారు.

వాస్తవానికి ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా 36.2 ఓవర్ల వరకు 196/5 తో పటిష్టమైన స్థితిలోనే ఉంది. కానీ ఆ తర్వాతే టీమిండియా బౌలింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఆస్ట్రేలియా చూస్తుండగానే తదుపరి ఐదు వికెట్లను జస్ట్ 40 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. గంభీర్ శిష్యుడు ఏకంగా నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. తన కెరియర్ లోనే అద్భుతమైన బౌలింగ్ వేసి ఆకట్టుకున్నాడు. దాదాపు 300 పరుగులు చేస్తుందనుకున్న దశ నుంచి ఆస్ట్రేలియా 46.4 ఓవర్లలో 236 పరుగులకు కుప్పకూలింది.

237 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన టీమిండియా ఏ దశలో కూడా వెనుకడుగు వేయలేదు. దూకుడుగా బ్యాటింగ్ చేసింది. రోహిత్ శర్మ (121*), విరాట్ కోహ్లీ (74*) రెండో వికెట్ కు ఏకంగా సెంచరీకి మించిన భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో టీమిండియాకు తిరుగులేకుండా పోయింది. కెప్టెన్ గిల్ (24) 24 పరుగులు చేసి సౌకర్యవంతంగానే కల్పించినప్పటికీ.. హేజిల్ వుడ్ బౌలింగ్లో క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మైదానంలోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. గత రెండు వన్డేలతాలుకు చేదు జ్ఞాపకాలను వదిలిపెట్టాడు.

విరాట్ కోహ్లీ ప్రారంభం నుంచి చివరి దాకా సౌకర్యవంతంగా బ్యాటింగ్ చేశాడు. తన ట్రేడ్ మార్క్ షాట్లతో అదగోట్టాడు. 81 బంతుల్లో ఏడు బౌండరీల సహాయంతో 74 పరుగులు చేసిన విరాట్.. ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. రోహిత్, విరాట్ దూకుడు ద్వారా టీమిండియా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఆతిథ్య జట్టు పై 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. ఇప్పటికే టీం ఇండియా వన్డే సిరీస్ కోల్పోయినప్పటికీ.. మూడో వన్డే జరుగుతున్న సిడ్ని మైదానానికి ప్రేక్షకులు భారీగా వచ్చారు. వారంతా కూడా రోహిత్, విరాట్ నామస్మరణతో ఊగిపోయారు. ఆ స్థాయిలో వచ్చిన ఆశేషమైన ప్రేక్షకులకు అద్భుతమైన క్రికెట్ మజాను విరాట్, రోహిత్ అందించారు.

విరాట్, రోహిత్ అద్భుతమైన జోడి. వీరిద్దరూ ఫామ్ లోకి వస్తే ఎంతటి గొప్ప జట్టు అయినా సరే తలవంచాల్సిందే. ఆస్ట్రేలియా కూడా అలాంటి అనుభవమే శనివారం ఎదురైంది. సొంత మైదానంలో ఆస్ట్రేలియా ప్లేయర్లపై రోహిత్, విరాట్ పై చేయి సాధించారు. ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా దూకుడుగా బ్యాటింగ్ చేశారు. తద్వారా ఆస్ట్రేలియా జట్టుకు 9 వికెట్ల తేడాతో ఓటమిని బహుమతిగా అందించారు. రోహిత్, విరాట్ బ్రిలియంట్ ఫామ్ లోకి రావడంతో ఆస్ట్రేలియా జట్టుకు ఘోరమైన పరాభవం మిగిలింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...

Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ ఉండాలి…

Allu Arjun: 'ఆర్య' సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్...

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...
Oktelugu Epaper
Exit mobile version