Ind Vs Eng Pant: రిషబ్ పంత్.. వికెట్ల వెనుకలా ఎంతో చురుకుగా ఉండే ఈ ధనాధన్ బ్యాట్స్ మెన్ బౌలర్లకు ఊపుతెస్తుంటాడు. ఇక తోటి బ్యాటర్లతోనూ సరదా సరదాగా ఉంటాడు. రిషబ్ పంత్ ఉంటే ఆ సందడినే వేరు.వికెట్ల వెనుకాల అరుస్తూ బౌలర్లకు సూచనలు ఇస్తూ బిజీ బిజీగా గడుపుతుంటాడు.
తాజాగా ఇంగ్లండ్ తో భారత్ టీ20 సందర్భంగా కూడా పంత్-రోహిత్ చేసిన పని వైరల్ అయ్యింది. బౌలింగ్ వేస్తూ అడ్డు వచ్చిన ఇంగ్లండ్ బౌలర్ పై రోహిత్ తో సెటైర్లు వేశాడు పంత్. దానికి అంతే సరదాగా సమాధానమిచ్చాడు రోహిత్. ఇదేఇప్పుడు వైరల్ గా మారింది.
తొలుత టాస్ గెలిచి ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. శనివారం ఎడ్జ్బాస్టన్లో జరిగిన రెండో టీ20లో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి రిషబ్ పంత్ బ్యాటింగ్ ప్రారంభించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పవర్ప్లే లోపల ఇంగ్లిష్ పేసర్లను టేకప్ చేయడంతో పంత్ -రోహిత్ సమర్థంగా ప్రారంభించారు. అయితే మధ్యలో వారి మధ్య జరిగిన సంభాషణ అందరి దృష్టిని ఆకర్షించింది.
ఒక పరుగు కోసం పరుగెత్తిన తర్వాత, రోహిత్ పిచ్ పై తనకు ఎదురుగా ఎందుకు పరిగెడుతున్నావని పంత్ను అడిగాడు. దానికి పంత్ ‘ఇంగ్లీష్ బౌలర్ అడ్డుపడుతున్నాడని’ సమాధానమిచ్చాడు. ఆట ప్రారంభ ఓవర్లో ఇది జరిగింది. దీంతో అడ్డొచ్చిన బౌలర్ను నెట్టేసేయ్ అని పంత్ ఉల్లాసంగా రోహిత్ని అడిగాడు.
ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ డేవిడ్ విల్లీ బౌలింగ్ లో సింగిల్ పరుగులిస్తుండగా రోహిత్ శర్మ ఎదురుగా రిషబ్ పంత్ వచ్చాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఈ సరదా సంభాషణ వీడియో వైరల్గా మారింది. “సామ్నే ఆ గయా థా… టక్కర్ మార్ డు క్యా? (ఇంగ్లండ్ బౌలర్ ఎదురుగా వచ్చాడు. నేను అతనిని కొట్టాలా?” పంత్ అన్నాడు. రోహిత్ స్పందిస్తూ “మార్ దే. ఔర్ క్యా? (అతన్ని కొట్టేసేయ్. ఇంకేంటి?” అంటూ రోహిత్ సరదాగా వ్యాఖ్యానించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://twitter.com/time__square/status/1545764193101438978?s=20&t=0f7sBWxF3_bgY5tH-vM45g