Homeక్రీడలుక్రికెట్‌Rajasthan Vs Mumbai: పోరగాళ్లు కాదు.. పోటుగాళ్లు..గౌహతీలో ముంబైని పోయించారు

Rajasthan Vs Mumbai: పోరగాళ్లు కాదు.. పోటుగాళ్లు..గౌహతీలో ముంబైని పోయించారు

Rajasthan Vs Mumbai: బుమ్రా, దీపక్ చాహర్, బౌల్డ్ వీళ్లేం మాములు బౌలర్లు కాదు. వీళ్ల బౌలింగ్ ను ఊచకోత కోశారు వైభవ్ సూర్యవంశీ, యశస్వీ జైస్వాల్. సూర్యవంశీ(39: 14 బంతుల్లో ఒక ఫోర్, ఐదు సిక్సర్లు), జైస్వాల్(77: 32 బంతుల్లో 10 ఫోర్లు, నాలుగు సిక్సర్లు) దుమ్ము రేపారు. వీరిద్దరూ 3.2 ఓవర్లలోనే 59 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తొలి వికెట్ కు కేవలం 30 బంతుల్లోనే 80 పరుగులు చేశారు.

Also Read: ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు తప్పు.. వైసిపి చేసింది అంతకంటే తప్పు

వర్షం కురిసి ఆగిపోయిన తర్వాత మ్యాచ్ నిర్వహణకు అంపైర్లు నిర్ణయించారు. టాస్ గెలిచిన హార్దిక్ బౌలింగ్ ఎంచుకున్నాడు. కానీ, రాజస్థాన్ బ్యాటర్లు దుమ్ము రేపారు. ముఖ్యంగా 15సంవత్సరాల వైభవ్ సూర్య వంశీ, యశస్వి జైస్వాల్ విధ్వంసానికి పరాకాష్టగా బ్యాటింగ్ చేశారు. మైదానంల పరుగుల వరద పారించారు. బౌలర్ ఎవరనేది చూడలేదు. ఎంతటి కఠినమైన బంతులు ఎదురైనా వదిలిపెట్టలేదు. బౌలర్ బంతి వేయడమే ఆలస్యం బౌండరీ మీటర్ లక్ష్యంగా బ్యాటింగ్ చేశారు.

11 ఓవర్లకు మ్యాచ్ కుదించడంతో రాజస్థాన్ బ్యాటర్లు విధ్వంసమే లక్ష్యంగా బ్యాటింగ్ చేశారు. ఎదురుదాడికి దిగి పరుగుల వరద పారించారు. సిక్సర్లవర్షం కురిపించారు. బౌలర్ల మీద కనికరం లేకుండా బ్యాటింగ్ చేశారు. పిచ్ మీద ఉన్న తేమను సద్వినియోగం చేసుకుంటూ పరుగులు తీశారు. వేగంగా ఆడుతూ ముంబై బౌలర్ల మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చారు.

చాహర్ ఓవర్ లో 22, బుమ్రా ఓవర్ లో 14, బౌల్డ్ ఓవర్ లో 22, శార్దూల్ ఠాకూర్ ఓవర్ లో 18 పరుగులు చేసి సంచలనం రేకెత్తించారు సూర్యవంశీ, జైస్వాల్. ఈక్రమంలో అనేక రికార్డులను సూర్యవంశీ, జైస్వాల్ బద్దలు కొట్టారు. దీపక్ చాహర్ బౌలింగ్ లో తొలి ఓవర్ లో 22 పరుగులు చేయడం ద్వారా రాజస్థాన్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. 2023లోకోల్ కతాపై నితీష్ రాణా బౌలింగ్ లో 26, 2009లో డర్బన్ వేదికగా కోల్ కతాపై బ్రాడ్ హడ్జ్ బౌలింగ్ లో 22, 2025లో జైపూర్ వేదికగా పంజాబ్ పై అర్ష్ దీప్ బౌలింగ్ లో 22 పరుగులు చేశారు.

ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా జైస్వాల్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. రాజస్థాన్ జట్టు తరుఫున అతడు 69 ఇన్నింగ్స్ లలో 19 హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో బట్లర్ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. బట్లర్ 82 ఇన్నింగ్స్ లలో 25, సంజు శాంసన్ 144 ఇన్నింగ్స్ లలో 25, రహానే 93 ఇన్నింగ్స్ లలో 19, షేన్ వాట్సన్ 76 ఇన్నింగ్స్ లలో 16 హాఫ్ సెంచరీలు చేశారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version