Harmanpreet Kaur team: బండి బాగా వెళుతున్నప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడే సమస్యలు మొదలవుతుంటాయి. లోపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఇప్పుడు భారత మహిళా క్రికెట్ జట్టు పరిస్థితి కూడా ఇలానే ఉంది. ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో టీమిండియా తొలి మ్యాచ్లో పాకిస్తాన్ మీద విజయం సాధించింది . ఆ తర్వాత నెదర్లాండ్ మీద విక్టరీ అందుకుంది. ఇదే ఊపులో దక్షిణాఫ్రికా మీద గెలుస్తుందనుకుంటున్న క్రమంలో.. ఓటమిపాలైంది.
టీమిడియాకు ఎదురైన ఓటమి ఎన్నో లోపాలను బయటపెట్టింది. ఈ లోపాలను అధిగమిస్తేనే టీమిండియా టి20 వరల్డ్ కప్ సాధిస్తుంది. ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో టీం ఇండియా గ్రూపు ఏ లో ఉంది. ఈ గ్రూపులో ఉన్న పాకిస్తాన్, నెదర్లాండ్స్ ఎప్పుడో ఇంటికి వెళ్లిపోయాయి. అన్ని జట్ల కంటే ఆస్ట్రేలియా 8 పాయింట్లో మొదటి స్థానంలో ఉంది. భారత్ ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నప్పటికీ.. నెట్ రన్ రేట్ మాత్రం టీమిండియాకే ఎక్కువగా ఉంది. భారత జట్టు తదుపరి బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాతో ఆడాలి. ఈ రెండు గెలిస్తే నేరుగా సెమీస్ వెళ్తుంది. ఒక్క దాంట్లో ఓడిపోయినా సరే నెట్ రన్ రేట్ అత్యంత కీలకమవుతుంది.
టీమిండియాలో బ్యాటింగ్ భారం మొత్తం స్మృతి మందాన, షాపాలీ వర్మ మీద మాత్రమే ఉంది. వీరిద్దరే ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నారు. అందువల్లే పరుగులు వస్తున్నాయి. చివర్లో రీచా అదరగొడుతోంది. కానీ మిడిల్ ఆర్డర్ మాత్రం దారుణంగా విఫలమవుతోంది. ముఖ్యంగా జమీమా ఏ మాత్రం గొప్పగా రావటం లేదు. హర్మన్ కూడా తన స్థాయి ఆట తీరు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది.
దక్షిణాఫ్రికా తో జరిగిన మ్యాచ్లో కాప్ క్యాచ్ ను మన అమ్మాయిలు జారవిడిచారు. అది కేవలం క్యాచ్ మాత్రమే కాదు మ్యాచ్ ఫలితం కూడా అని తర్వాత తేలిపోయింది. ఎందుకంటే వచ్చిన అవకాశాన్ని కాప్ అద్భుతంగా సద్వినియోగం చేసుకుంది. దుమ్ము రేపే రేంజ్ లో బ్యాటింగ్ చేసి అదరగొట్టింది. మరోవైపు ఆ మ్యాచ్ లో ఫీల్డింగ్ కూడా దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే మ్యాచ్లలో టీమిండియా ప్లేయర్లు సత్తా చూపించాల్సిన అవసరం ఉంది
భారత జట్టుకు స్పిన్ బౌలింగ్ ప్రధాన బలం. తెలుగు క్రీడాకారిణి శ్రీ చరణి సత్తా చూపిస్తోంది. ఇప్పటికే ఆమె టి20 బౌలర్ల జాబితాలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్లలో పదవి వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. ఆమెకు తగ్గట్టుగా మిగతావాళ్లు బౌలింగ్ వేస్తే భారతజట్టు పెద్దగా ఇబ్బందిపడాల్సిన అవసరంఉండదు. దీప్తి శర్మ ఒక మ్యాచ్లో 5 వికెట్ల ప్రదర్శన చేసింది. ఆ తర్వాత మిగతా మ్యాచ్లలో సత్తా చూపించలేదు. పేస్ బౌలర్లు అంత గొప్పగా బౌలింగ్ చేయడం లేదు. ఈ నేపథ్యంలో తదుపరి మ్యాచ్లలో వారు సత్తా చూపించాల్సిన అవసరం ఉంది.
