Homeఆంధ్రప్రదేశ్‌Sai Krishna case latest update: గాదె సాయి కృష్ణ కేసు.. అసలు నిజాలను బయటపెట్టిన...

Sai Krishna case latest update: గాదె సాయి కృష్ణ కేసు.. అసలు నిజాలను బయటపెట్టిన సిట్..

Sai Krishna case latest update: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ నగరంలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల కాలంలో గాదె సాయి కృష్ణ అనే యువకుడి కేసు సంచలనం కలిగించింది. అయితే ఇతడు నిన్నటి వరకు మిస్సింగ్ అని పోలీసులు చెప్పారు. ఇప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు కీలకమైన విషయాలను బయటపెట్టారు. దీంతో ఈ కేసు వ్యవహారం ఏపీ రాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా కుదిపి వేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. అంతేకాదు ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు రిమాండ్ రిపోర్ట్ కోర్టుకు సమర్పించిన నేపథ్యంలో.. ఈ కేసు కీలక మలుపు తీసుకుంది.

సాయి కృష్ణను గత నెల 6న మార్కాపురంలో పట్టుకుని కృష్ణలంక ప్రాంతాన్ని తీసుకొచ్చారు. అక్కడ కస్టడీకి అప్పగించారు. ఇక అప్పటినుంచి అతడి జడ కనిపించలేదు. చట్టానికి విరుద్ధంగా అతడిని కసిడిలో ఉంచారు. మే 6 నుంచి 8 తేదీలలో సాయికృష్ణ స్థానిక పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాడు. అతడి మీద అనేక రకాల పాత కేసులు.. నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్లో ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో సాయి కృష్ణ అపస్మారక స్థితిలో ఉన్నాడని సిట్ అధికారులకు అతని తల్లి చెప్పింది. అయితే గత నెల ఒకటి నుంచి ఈ నెల ఒకటి వరకు ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీటీవీ ఫుటేజీ కనిపించకపోవడం విశేషం.

పోలీస్ స్టేషన్ కు వచ్చిన తర్వాత సాయి కృష్ణ తన మొబైల్ ఫోన్ సిఐ నాగరాజుకు ఇచ్చారు. అయితే అతడిని సిఐ నాగరాజు మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచలేదు. పైగా హైకోర్టుకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కస్టడీలో అతడిని తీవ్రంగా కొట్టారు. గాయాల బారిన పడిన అతడు చనిపోయాడు. ఆ తర్వాత అతడి శవాన్ని మొత్తం మాయం చేశారు. శవాన్ని పూడ్చి వేయడానికి లేదా తగలబెట్టడానికి ప్రయత్నించారు. అయితే ఆ మృతదేహం ఇంకా లభించలేదు. సాయి కృష్ణ శవాన్ని ఏం చేశారనే దానిమీద ఇంకా క్లారిటీ లేదు. దానిమీద సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు నాగరాజు దర్యాప్తు అధికారులకు సహకరించకపోవడంతో ఇంకా పూర్తి వివరాలు తెలియడం లేదు. కస్టడీలో అతడిని తీవ్రంగా కొట్టడం వల్లే చనిపోయాడని ఇప్పటికే సిట్ అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. రిమాండ్ రిపోర్టులో కూడా అదే విషయాన్ని బయటపెట్టారు. సిసి ఫుటేజ్ మొత్తాన్ని ఉద్దేశపూర్వకంగానే తొలగించారు. దీంతో సెట్ అధికారుల అనుమానాలు పూర్తిగా నిజమయ్యాయి.

మరోవైపు ఈ కేసులో కృష్ణలంక సీఐ నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి ఆయనకు 14 రోజులపాటు రిమాండ్ విధించారు.. రిమాండ్ కంటే ముందు ఆయనకు జి జి హెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు అధికారులు.. ఆ తర్వాత అతడిని జైలుకు తరలించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version