RCB IPL prize money 2026: బెంగళూరు రెండవసారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. తద్వారా ఐపిఎల్ హిస్టరీలో సరికొత్త చరిత్రను సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఐదేసి సార్ల చొప్పున ముంబై, చెన్నై జట్లు ట్రోఫీలు గెలిచాయి. కోల్కతా జట్టు కూడా ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు ఉంది. ఈ నేపథ్యంలో 2008 నుంచి మొదలు పెడితే 2024 వరకు అనేక సందర్భాలలో ఫైనల్ దాకా వచ్చినప్పటికీ బెంగళూరు ఐపిఎల్ ట్రోఫీ గెలవలేకపోయింది. 2025లో మాత్రం పంజాబ్ జట్టు మీద గెలిచి ట్రోఫీని అందుకుంది.
ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత బెంగళూరు జట్టు విలువ మరింత పెరిగింది. విజేత జట్టుకు బిసిసిఐ 20 కోట్ల ప్రైజ్ మనీ ఇస్తుంది.. ఈ ఆదాయం మాత్రమే కాకుండా.. ప్రకటనలు.. టికెట్లు.. మైదానాలలో బ్రాండ్ ప్రమోషన్లు.. ప్రసార హక్కులలో వాటా.. మిగతా ఒప్పందాలు లెక్కేసుకుంటే యాజమాన్యాలకు భారీగానే ఆదాయం వచ్చింది. ఈ జాబితాలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 595 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ 552,రాజస్థాన్ రాయల్స్ 549, కోల్కతా నైట్ రైడర్స్ 538, పంజాబ్ కింగ్స్ 534, లక్నో 512 కోట్లు, ముంబై ఇండియన్స్ 501, గుజరాత్ టైటాన్స్ 498, ఢిల్లీ క్యాపిటల్స్ 486, సన్రైజర్స్ హైదరాబాద్ 495 కోట్ల ఆదాయాన్ని సంపాదించాయి.
ఈ స్థాయిలో ఆదాయం రావడంతో ప్రపంచంలోనే అత్యంత ప్రాఫిటబుల్ స్పోర్ట్స్ లీగ్ గా ఐపీఎల్ కొనసాగుతోంది. ఐపీఎల్ 20008 లో మొదలైంది. ఇప్పటివరకు విజయవంతంగా 19 సీజన్లు పూర్తిచేసుకుంది. ప్రారంభంలో వేల కోట్లుగా ఉన్న ఐపిఎల్ విలువ.. ఇప్పుడు ఏకంగా లక్షల కోట్లన్న దాటేసింది. బ్రాండ్ విలువ పెరుగుతున్న నేపథ్యంలో ఆదాయం అంచనాలకు మించి వస్తోంది.
గతంలో చైనా కంపెనీలు ఐపీఎల్ ట్రోఫీని స్పాన్సర్ చేసేవి. ఇప్పుడు టాటా కంపెనీ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. అనేక కార్పొరేట్ కంపెనీలు ప్రకటన కర్తలుగా ఉన్నాయి. కంపా నుంచి మొదలు పెడితే గూగుల్ వరకు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి. బ్రాండ్ విలువ పెరగడంతో మార్కెటింగ్ స్థాయి కూడా అదే రేంజ్ లో ఉంది. బీసీసీఐ మీద కనక వర్షం కురుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు.. ఇతర టోర్నీలు నిర్వహణలో వచ్చే ఆదాయం కంటే ఐపీఎల్ ద్వారా వచ్చే ఆదాయమే బీసీసీఐకి అధికంగా ఉందంటే.. ఐపీఎల్ స్థాయి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
