IPL 2024 : హిట్ మ్యాన్ వీర విహారం.. బౌలర్లకు గాయాలు..

ఇక కీలక బౌలర్లు గాయాల బారిన పడుతుండడంతో ముంబై జట్టులో ఆందోళన నెలకొంది. ముంబై జట్టులో బుమ్రా, ఆకాష్ మద్వాల్, నువాన్ తుషారా, మధు శనక, గెరాల్డ్ కోయెట్జీ, ల్యుక్ ఉడ్ వంటి బౌలర్లు ఉన్నారు. వీరిలో తుషార, మధు శనక గాయపడ్డారు. గెరాల్డ్ కోయెట్జీ గాయం నుంచి ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముంబై బౌలింగ్ భారం మొత్తం బుమ్రా మీదనే పడే అవకాశం కనిపిస్తోంది.

Written By: NARESH, Updated On : March 19, 2024 3:40 pm

IPL 2024 Rohit Sharma

Follow us on

IPL 2024: మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ప్రత్యేక శిబిరాలలో ఆటగాళ్లు శిక్షణ పొందుతున్నారు. ఇక ఈ టోర్నీలో మోస్ట్ ఫేవరెట్ జట్టైన ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నెట్స్ లో సాధన చేస్తున్నారు. అయితే ఈ జట్టుకు ఆటగాళ్ల గాయాలు ఇబ్బందికరంగా పరిణామించాయి. దిల్షాన్ మదుషనక, నువాన్ తుషార గాయాల కారణంగా కొన్ని మ్యాచ్ లకు దూరమైనట్టు మేనేజ్మెంట్ ప్రకటించింది. ఇక టోర్నీకి మూడు రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ముంబై స్టార్ పేసర్ జేసన్ బహ్రెన్ డార్ఫ్ గాయం బారిన పడ్డాడు. దీంతో అతడి స్థానంలో ఇంగ్లాండ్ బౌలర్ ల్యూక్ ఉడ్ ను ముంబై జట్టు తీసుకుంది. 50 లక్షల కనీస ధరకు అతడిని కొనుగోలు చేసింది. ఇప్పటికే ఒప్పందం కూడా పూర్తయినట్టు తెలుస్తోంది.

ఎడమ చేతి వాటం బౌలరయిన వుడ్ మంగళవారం ముంబై జట్టుతో భాగస్వామ్యం అయ్యాడు. వుడ్ ఇప్పటివరకు ఐదు టీ – 20 లు మాత్రమే ఆడాడు.. అయినప్పటికీ ఎనిమిది టికెట్లు పడగొట్టాడు. “24 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీయడం” ఇప్పటివరకు అతడి అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది.

ఇది ఇలా ఉండగా హిట్ మ్యాన్ ముంబై జట్టు ప్రాక్టీస్ లో భాగమయ్యాడు. బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ప్రత్యేకమైన నెట్స్ లో వీర విహారం చేశాడు. ఐపీఎల్ 17వ సీజన్ కు తాను సిద్ధంగా ఉన్నానంటూ ప్రత్యర్థి జట్ల బౌలర్లకు హెచ్చరికలు పంపాడు. ఈ సీజన్ ప్రారంభానికి ముందే ముంబై జట్టు రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తొలగించింది. గుజరాత్ జట్టు నుంచి ట్రేడింగ్ ద్వారా కొనుగోలు చేసిన హార్దిక్ పాండ్యాను కొత్త సారధిగా నియమించింది.. నిన్నటిదాకా రోహిత్ ప్రాక్టీస్ సెషన్ కు హాజరు కాకపోవడంతో.. రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. అయితే తన ఆగమనం ద్వారా వాటన్నింటికీ రోహిత్ చెక్ పెట్టాడు.

ఇక కీలక బౌలర్లు గాయాల బారిన పడుతుండడంతో ముంబై జట్టులో ఆందోళన నెలకొంది. ముంబై జట్టులో బుమ్రా, ఆకాష్ మద్వాల్, నువాన్ తుషారా, మధు శనక, గెరాల్డ్ కోయెట్జీ, ల్యుక్ ఉడ్ వంటి బౌలర్లు ఉన్నారు. వీరిలో తుషార, మధు శనక గాయపడ్డారు. గెరాల్డ్ కోయెట్జీ గాయం నుంచి ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముంబై బౌలింగ్ భారం మొత్తం బుమ్రా మీదనే పడే అవకాశం కనిపిస్తోంది.