భారత క్రికెటర్ కు కరోనా: IND vs SL టీ20 రద్దు

శ్రీలంక-ఇండియాల మధ్య జరుగుతున్న క్రికెట్ సమరంపై కరోనా దాడి చేసింది. భారత జట్టుకు షాకిచ్చింది. యువ ఆటగాడు కృనాల్ పాండ్యాకు కరోనా సోకింది. దీంతో ఈరోజు జరగాల్సిన భారత్-శ్రీలంక రెండో టీ20 వాయిదా పడింది. ప్రస్తుతం ఆటగాళ్లు అంతా బయోబుడగలో ఉన్నా కూడా అతడికి పాజిటివ్ రావడం షాకింగ్ గా మారింది. తొలి టీ20లో భారత జట్టు ఘనవిజయం సాధించింది. టీమిండియా రెండో మ్యాచ్ ను గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావించింది. మరికొన్ని గంటల్లో మ్యాచ్ […]

Written By: NARESH, Updated On : July 27, 2021 5:19 pm
Follow us on

శ్రీలంక-ఇండియాల మధ్య జరుగుతున్న క్రికెట్ సమరంపై కరోనా దాడి చేసింది. భారత జట్టుకు షాకిచ్చింది. యువ ఆటగాడు కృనాల్ పాండ్యాకు కరోనా సోకింది. దీంతో ఈరోజు జరగాల్సిన భారత్-శ్రీలంక రెండో టీ20 వాయిదా పడింది. ప్రస్తుతం ఆటగాళ్లు అంతా బయోబుడగలో ఉన్నా కూడా అతడికి పాజిటివ్ రావడం షాకింగ్ గా మారింది.

తొలి టీ20లో భారత జట్టు ఘనవిజయం సాధించింది. టీమిండియా రెండో మ్యాచ్ ను గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావించింది. మరికొన్ని గంటల్లో మ్యాచ్ మొదలవుతుండగా.. కృనాల్ పాండ్యాకు కరోనా వైరస్ సోకిన విషయం సంచలనం సృష్టిస్తోంది.

ఈరోజు జరగాల్సిన మ్యాచ్ ను బుధ, లేదా గురువారానికి వాయిదా వేస్తారని అంటున్నారు. లేదా సీరియల్ గా నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

కృనాల్ పాండ్యాకు కరోనా సోకడంతో టీ20 మ్యాచ్ రద్దు అయ్యిందని.. భారత జట్టులోని మిగతా ఆటగాళ్ల టెస్టు ఫలితాలు తెలియాల్సి ఉందని బీసీసీ అధికారి తెలిపారు. సాయంత్రం 6 గంటలకు ఇవి తెలుస్తాయని.. అప్పుడు వైరస్ సోకని పక్షంలో బుధవారం మ్యాచ్ ఉండొచ్చని బీసీసీఐ అధికారి తెలిపారు.

ఇక కృనాల్ కు కరోనా పాజిటివ్ సోకడంతో ఇంగ్లండ్ కు ఈ సిరీస్ తో వెళ్లాల్సిన సూర్యకుమార్ యాదవ్, ఫృథ్వీ షాలపైనా ప్రభావం పడనుంది. వారిద్దరినీ ఇంగ్లండ్ టూరుకు పంపిస్తారా? లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఇంగ్లండ్ లో రిషబ్ పంత్ కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే.