Homeక్రీడలుక్రికెట్‌IND Vs ENG: సచిన్ ఆల్ టైం రికార్డ్ బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. ఇండియన్...

IND Vs ENG: సచిన్ ఆల్ టైం రికార్డ్ బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ.. ఇండియన్ క్రికెటర్ గా సరికొత్త చరిత్ర..

భారత క్రికెట్ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ సరికొత్త ఘనతను సృష్టించాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఆల్ టైం రికార్డును బద్దలు కొట్టాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు పై నాలుగు వేల పరుగులు చేసిన తొలి భారతీయ ఆటగాడిగా విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను అందుకున్నాడు.

IND Vs ENG: ఈ అరుదైన ఘనతను అందుకోవడం ద్వారా విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ ను అధిగమించాడు. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న మూడవ వన్డేలో విరాట్ కోహ్లీ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. మూడు ఫార్మాట్లలో ఇంగ్లాండ్ జట్టుపై విరాట్ కోహ్లీ 4వేలకు పైగా పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ 3990 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ మాత్రమే కాదు.. సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా వంటి జట్లపై అంతర్జాతీయ క్రికెట్లో 3 వేలకు పైగా పరుగులు చేసిన తొలి ఇండియన్ ప్లేయర్ గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా జట్టుపై ఐదువేలకు పైగా పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. ఇంగ్లాండ్ జట్టు పై నాలుగు వేలకు పైగా పరుగులు, సౌత్ ఆఫ్రికా పై 3 వేలకు పైగా పరుగులు చేశాడు.. అంతర్జాతీయ క్రికెట్ లో మూడు దేశాలపై ఈ స్థాయిలో పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన విరాట్ కోహ్లీ.. రికి పాంటింగ్ రికార్డును సమన్ చేశాడు.

విరాట్ కోహ్లీ, పాంటింగ్ చెరి మూడు దేశాలపై 4 వేలకు పైగా చేశారు. సచిన్ టెండూల్కర్ రెండు దేశాలపై ఈ ఘనతను అందుకున్నాడు. ఆసియాలో మూడు ఫార్మేట్ లలో కలిపి అత్యంత వేగంగా 16 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో సచిన్ టెండుల్కర్ రికార్డును విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. సచిన్ టెండుల్కర్ 353 ఇన్నింగ్స్ లలో ఈ ఘనతను అందుకున్నాడు. విరాట్ కోహ్లీ 340 ఇన్నింగ్స్ లలో నే ఈ రికార్డు సృష్టించాడు. ఇక అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మూడవ వన్డేలో ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆరు పరుగులకే కెప్టెన్ రోహిత్ శర్మ (1) వికెట్ ను భారత్ కోల్పోయింది. ఆ తర్వాత గిల్(112), విరాట్ కోహ్లీ (52) రెండో వికెట్ కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (78) పరుగులు చేసి ఆది రషీద్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు , కేఎల్ రాహుల్ (18*), అక్షర్ పటేల్ (5*) క్రీజ్ లో ఉన్నారు. హార్థిక్ పాండ్యా 18 పరుగులు చేసి రషీద్ బౌలింగ్లో వెను తిరిగాడు. ప్రస్తుతం టీమిండియా 42.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper