Hardik And Natasa: హార్దిక్, నటాషా విడిపోయినట్టే.. ఇదిగో ప్రూఫ్

టీమిండియా స్వదేశానికి వచ్చిన తర్వాత ఆటగాళ్లు సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం వారి వారి స్వగృహాలకు వెళ్లిపోయారు. అక్కడ కూడా వేడుకల్లో పాల్గొన్నారు. కానీ హార్దిక్ పాండ్యా తన కుమారుడితో టి20 వరల్డ్ కప్ విక్టరీ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : July 6, 2024 1:03 pm

Hardik And Natasa

Follow us on

Hardik And Natasa: మొన్నటిదాకా కోల్డ్ స్టోరేజీ లోకి వెళ్లిన హార్దిక్ పాండ్యా – నటాషా విడాకుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఐపీఎల్ జరుగుతున్నప్పుడు వీరిద్దరూ విడాకులు తీసుకున్నారని వార్తలు వినిపించాయి. ఆ తర్వాత నటాషా వేరే వ్యక్తితో కనిపించింది. దీంతో హార్దిక్ – నటాషా విడాకులు తీసుకున్నది నిజమేనని అందరూ అనుకున్నారు. అయితే అవన్నీ ఉత్తి పుకార్లు మాత్రమేనని.. ఐపీఎల్ లో ముంబై జట్టు విఫలమైన నేపథ్యంలో.. తనపై వస్తున్న విమర్శలను హార్దిక్ ఇలా డైవర్ట్ చేశాడని కామెంట్లు వినిపించాయి. అయితే ఇదే దశలో హార్దిక్ టి20 వరల్డ్ కప్ కు ఎంపికయ్యాడు. టోర్నీలో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బంతి, బ్యాట్ తో ఆకట్టుకున్నాడు. దక్షిణాఫ్రికా తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో చివరి ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేసి.. రెండు వికెట్లు పడగొట్టి, 8 పరుగులు మాత్రమే ఇచ్చి భారత జట్టును గెలిపించాడు. భారత జట్టు చారిత్రాత్మక విజయం సాధించిన నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యాను ఆలింగనం చేసుకున్నాడు. ఇదే సమయంలో హార్దిక్ కన్నీరు కార్చాడు.. దీంతో వారిద్దరి మధ్య విభేదాలు సమసిపోయాయని సంకేతాలు ఇచ్చారు. అయితే టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆటగాళ్లు మొత్తం వారి వారి కుటుంబాలతో సందడి చేశారు. బుమ్రా తన సతీమణి కౌగిలించుకున్నాడు. సూర్య కుమార్ యాదవ్ తన భార్యతో ఆనందాన్ని పంచుకున్నాడు.. రోహిత్ శర్మ తన అర్ధాంగి, కూతురుతో సంతోషాన్ని రెట్టింపు చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మతో వీడియో కాల్ లో మాట్లాడాడు. కానీ ఎటోచ్చీ హార్దిక్ పాండ్యా ఒంటరిగా మిగిలిపోయాడు.

టీమిండియా స్వదేశానికి వచ్చిన తర్వాత ఆటగాళ్లు సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం వారి వారి స్వగృహాలకు వెళ్లిపోయారు. అక్కడ కూడా వేడుకల్లో పాల్గొన్నారు. కానీ హార్దిక్ పాండ్యా తన కుమారుడితో టి20 వరల్డ్ కప్ విక్టరీ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. వాస్తవానికి ఈ వేడుకల్లో నటాషా పాల్గొంటుందని అభిమానులు భావించారు. కానీ హార్దిక్ కుమారుడు మాత్రమే ఆ సంబరాలలో సందడి చేశాడు. దీంతో అందరూ నటాషా – హార్దిక్ విడాకులు తీసుకున్నారని ఒక అంచనాకు వచ్చారు. అయితే హార్దిక్ టి20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ నటాషా ఒక మెసేజ్ లేదా ట్వీట్ కూడా చేయలేదు.

ఇక హార్దిక్ పాండ్యా ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలకు హాజరయ్యాడు. దేశవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు మొత్తం ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. వారిలో చాలామంది తమ జీవిత భాగస్వాములతో ఆ వేడుకకు వచ్చారు. కెమెరాల ముందు ఫోజులు ఇచ్చారు. కానీ హార్దిక్ పాండ్యా సింగిల్ గానే వచ్చాడు. కెమెరాలకు ఫోజులు ఇచ్చి వెళ్లిపోయాడు. ఈ ఉదంతాల నేపథ్యంలో హార్దిక్ – నటాషా విడాకులు తీసుకున్నారని.. దానికి ఇవే నిదర్శనాలని అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. ఇదే సమయంలో నటాషాను తెగ విమర్శిస్తున్నారు.