Delhi Vs Punjab Match Fixing: నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్లో.. ఢిల్లీ గెలిచింది. ఉత్కంఠ మధ్య సాగిన మ్యాచ్లో విజయం సాధించి అదరగొట్టింది. పంజాబ్ జట్టు కు దిమ్మతిరిగే ఓటమిని బహుమతిగా ఇచ్చింది.. తద్వారా ఈ టోర్నీలో ప్లే ఆఫ్ ఆశలను ఢిల్లీ జట్టు సజీవంగా ఉంచుకుంది..
211 పరుగుల టార్గెట్ తో సంఘంలోకి దిగిన ఢిల్లీ జట్టు.. ప్రారంభంలోనే నాలుగు కీలక వికెట్లను కోల్పోయింది. కేఎల్ రాహుల్, అభిషేక్, సాహిల్, స్టబ్స్ వంటి ప్లేయర్లు విఫలం కావడంతో ఢిల్లీ జట్టు ఓటమి ఖాయమని అందరూ అనుకున్నారు. ఈ దశలో కెప్టెన్ అక్షర్ పటేల్(56), డేవిడ్ మిల్లర్ (51), శర్మ (24), తివారి (18*) సత్తా చూపించారు.. దీంతో ఢిల్లీ జట్టు 19 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి లక్ష్యాన్ని పూర్తి చేసింది.
ఒక దశలో ఢిల్లీ జట్టుకు ఓటమి ఖాయమని అందరూ అనుకున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్ బౌలర్లు చేతులెత్తేశారు. ఇదే సమయంలో ఢిల్లీ బ్యాటర్లు అదరగొట్టారు. ఏమాత్రం భయపడకుండా దూకుడుగా బ్యాటింగ్ చేశారు. నాలుగు కీలక వికెట్లు కోల్పోయినప్పటికీ.. గెలవాలనే కసి ఉండడంతో ఢిల్లీ బ్యాటర్లు పోరాడితే పోయేదేముంది డ్యూడ్ అన్నట్టుగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా మిల్లర్.. అక్షర్ పటేల్ పంజాబ్ బౌలర్లను ఎదుర్కొన్న తీరు అద్భుతం. ఈ సీజన్లో వరుస విజయాలతో అదరగొట్టిన పంజాబ్ జట్టు.. అదే స్థాయిలో ఓటములతో ఇప్పుడు ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టంగా మార్చుకుంది. పాయింట్ల పట్టికలో మొన్నటిదాకా మొదటి స్థానంలో ఉన్న పంజాబ్.. ఇప్పుడు నాలుగవ స్థానానికి పడిపోయింది. వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిపోయింది.
ఈ మ్యాచ్లో పంజాబ్ జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు.. ఢిల్లీ బౌలర్ నో బాల్ వేసాడు. ఆ బంతిని సహజంగానే అంపైర్ ఫ్రీ హిట్ గా ప్రకటించాడు. దీంతో పంజాబ్ బ్యాటర్ భారీ షాట్ ఆడాడు. ఆ బంతి మిడిల్ ఆఫ్ లో గాలిలోకి లేచింది. ఆ బంతిని క్యాచ్ అందుకోలేక పోయాడు అక్షర్ పటేల్. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.. మ్యాచ్ ఫిక్సింగ్ అయిందని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఇదంతా వాస్తవం కాదని ఢిల్లీ అభిమానులు చెబుతున్నారు. నోబాల్ అవడం వల్లే అక్షర్ క్యాచ్ పట్టలేదని ఢిల్లీ అభిమానులు క్లారిటీ ఇస్తున్నారు.
No way Axar Patel didn’t even try to catch such an easy catch.
Something about the IPL genuinely feels scripted nowadays. pic.twitter.com/Dh6YvflHoJ
— Abhishek Kumar (@Abhishek060722) May 11, 2026