క్రికెట్ లోగుట్టు: కోహ్లి.. రోహిత్‌లకు పడడం లేదా..!

ఐపీఎల్‌ 2020లో ముంబయి ఇండియన్స్‌ టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతోంది. నిన్న మ్యాచ్‌లో గెలిచి మరోసారి ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఈ జట్టుకు సారథ్యం వహిస్తున్నది హిట్‌మ్యాన్‌ రోహిత్‌శర్మ. అంతటి సక్సెస్‌ ఫుల్‌గా జట్టును నడిపిస్తున్న రోహిత్‌ శర్మకు ఆసిస్‌ టూర్‌‌కు భారత జట్టులో చోటు దక్కలేదు. ఇందుకు విరాట్‌ కోహ్లీనే కారణమని అందరూ అంటున్నారు. ఎప్పటినుంచో విరాట్‌, రోహిత్‌ మధ్య కోల్డ్‌వార్‌‌ నడుస్తున్నట్లు చెబుతున్నారు. Also Read: వైరల్: జోష్ గా కోహ్లీ బర్త్ డే వేడుకలు వీరిద్దరి […]

Written By: NARESH, Updated On : November 6, 2020 4:27 pm
Follow us on

ఐపీఎల్‌ 2020లో ముంబయి ఇండియన్స్‌ టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతోంది. నిన్న మ్యాచ్‌లో గెలిచి మరోసారి ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఈ జట్టుకు సారథ్యం వహిస్తున్నది హిట్‌మ్యాన్‌ రోహిత్‌శర్మ. అంతటి సక్సెస్‌ ఫుల్‌గా జట్టును నడిపిస్తున్న రోహిత్‌ శర్మకు ఆసిస్‌ టూర్‌‌కు భారత జట్టులో చోటు దక్కలేదు. ఇందుకు విరాట్‌ కోహ్లీనే కారణమని అందరూ అంటున్నారు. ఎప్పటినుంచో విరాట్‌, రోహిత్‌ మధ్య కోల్డ్‌వార్‌‌ నడుస్తున్నట్లు చెబుతున్నారు.

Also Read: వైరల్: జోష్ గా కోహ్లీ బర్త్ డే వేడుకలు

వీరిద్దరి మధ్య వివాదంపై ఇప్పటికే మీడియాల్లోనూ వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇప్పటివరకు ఒకరినొకరు కలిపి మొత్తం ఏడు సార్లు రన్ ఔట్ చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ తరహా వార్తలు ప్రారంభమయ్యాయి. సోషల్ మీడియాలో ఇరు క్రికెటర్ల అభిమానులు పోటాపోటీ పోస్టింగ్‌లు పెట్టుకున్నారు కూడా. గతేడాది ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్‌కు ముందు భారత్ ఓడిపోయింది. అయితే  ఆ రోజు బ్యాటింగ్ ఆర్డర్‌‌కు సంబంధించి విరాట్ తీసుకున్న నిర్ణయం రోహిత్‌కు నచ్చలేదని టాక్. అప్పటి నుంచే కెప్టెన్‌కు వైస్ కెప్టెన్‌కు మధ్య వివాదం రాజుకుందని టాక్ ఉంది.

మరికొద్ది రోజుల్లో ఐపీఎల్‌ 2020 టోర్నీ ముగియనుంది. ఈ టోర్నీ ముగియగానే భారతజట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. వన్డేలు, ట్వంటీలు, టెస్టులకు ఇలా మూడు ఫార్మాట్లలో మ్యాచ్‌లు జరుగనుండగా.. ఈ మూడింటికీ సెలెక్టర్లు రోహిత్‌ను పక్కన పెట్టేశారు. దీని వెనుక విరాట్ హస్తం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు నిన్న జరిగిన ఓ ఘటన అనుమానాలను మరింత పెంచింది. .

Also Read: ఐపీఎల్: క్వాలిఫయర్‌‌ మ్యాచ్‌ల షెడ్యూల్‌ ఇదే..

గురువారం విరాట్ కోహ్లీ పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లు క్రికెట్ అభిమానులు బాలీవుడ్ స్టార్లు కోహ్లీకి బర్త్ డే విషెస్ తెలిపారు. కానీ.. రోహిత్ శర్మ మాత్రం విష్‌ చేయలేదు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయని అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. గత ఏప్రిల్ 30న రోహిత్ బర్త్ డేకు కోహ్లీ ట్విట్ చేశాడు. కానీ ఇప్పుడు రోహిత్ చేయలేదు. దీంతో వీరి మధ్య ఉన్న వివాదానికి మరోసారి బలం చేకూరినట్లయింది.