spot_img
Homeక్రీడలుMS Dhoni Jersey: నంబర్ 7 జెర్సీపై బీసీసీఐ కీలక నిర్ణయం.. సచిన్ తరువాత ధోనీకి...

MS Dhoni Jersey: నంబర్ 7 జెర్సీపై బీసీసీఐ కీలక నిర్ణయం.. సచిన్ తరువాత ధోనీకి అరుదైన గౌరవం..

MS Dhoni Jersey: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోనీ అంటే ఇప్పటికీ క్రికెట్ అభిమానుల్లో యమక్రేజ్ ఉంటుంది. భారత్ జట్టు మైదానంలో క్లిష్ట సమయాల్లో ఉన్నప్పుడు క్రికెట్ వీక్షించేవారికి ఎంఎస్ ధోనీ గుర్తుకొస్తాడంటే అతిశయోక్తి లేదు. ధోనీ ఉంటేనా.. అతని కెప్టెన్సీ మాయాజాలంతో మ్యాచ్ భారత్ వైపుకు తిప్పేవాడు అంటూ మ్యాచ్ వీక్షించే వారు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ఇచ్చిన ధోనీ ఐపీఎల్‌లో తన కెప్టెన్సీ, బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రేమికులను అలరిస్తున్నాడు. తాజాగా బీసీసీఐ మహేంద్ర సింగ్ ధోనీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

ధోని జర్సీ రిటైర్‌..
భారత్ క్రికెట్‌లో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నంబర్ 10 జెర్సీకి చాలా ప్రాముఖ్యత ఉంది. జెర్సీ నంబర్ 10 అంటే సచిన్ గుర్తుకొస్తారు. జెర్సీ నంబర్‌ 7 అంటే మహేంద్ర సింగ్ ధోనీ గుర్తుకొస్తారు. సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ తరువాత అతని జెర్సీ నంబర్ 10కి బీసీసీఐ రిటైర్మెంట్ ప్రకటించింది. సచిన్ పై ఉన్న గౌరవంతో భవిష్యత్‌లో ఏ భారత క్రికెటర్‌కు ఆ జెర్సీ నంబర్ కేటాయించబోమని బీసీసీఐ అప్పట్లో ప్రకటించింది. తాజాగా ధోని ధరించిన ఐకానిక్ నంబర్ 7 జెర్సీని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు రిటైర్ చేసింది. సచిన్ టెండూల్కర్ తర్వాత బీసీసీఐ తన జెర్సీని రిటైర్ చేసిన రెండో ఆటగాడిగా ధోనీ నిలిచాడు. ధోనీ క్రీడకు అందించిన సేవలను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ అతని జెర్సీని రిటైర్ చేయాలని నిర్ణయించుకున్నట్లు బీసీసీఐ తెలిసింది. నంబర్ 7 జెర్సీని ఏ ఆటగాడు ఉపయోగించడానికి అందుబాటులో ఉండదు.

మాజీ క్రికెటర్ల సూచన..
సచిన్ జెర్సీ నంబర్ 10కి రిటైర్మెంట్ ఇచ్చినట్లుగానే.. ధోనీ జెర్సీ నంబర్ 7కు రిటైర్మెంట్ ఇవ్వాలని పలువురు మాజీ క్రికెటర్లు గతంలో బీసీసీఐకి సూచించారు. ధోనీ అభిమానుల నుంచి కూడా తరచూ ఇలాంటి డిమాండ్ వినిపిస్తోంది. తాజాగా బీసీసీఐ ధోనీకి అరుదైన గౌరవాన్ని కట్టబెట్టింది. ధోనీ జెర్సీ నంబర్ 7 రిటైర్ అవుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

అద్భుతాలు సృష్టించిన ధోనీ..
క్రికెట్‌లో దిగ్గజం ధోని ఆటగాడిగా, కెప్టెన్‌గా అద్భుతమైన రికార్డులు సృష్టించాడు. భారత జట్టు సారథిగా, అతను అన్ని ప్రధాన ఐసీసీ ట్రోఫీలలో తన జట్టును విజయపథంలో నడిపించాడు. 2007 టీ20 ప్రపంచ కప్, 2011లో వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని గెలిపించాడు. భారత్ తరఫున 350 వన్డే మ్యాచ్‌లు ఆడిన ధోని 50.57 సగటుతో 10,773 పరుగులు చేశాడు. అందులో 10 సెంచరీలు, 73 అర్ధ సెంచరీలు చేశాడు. టీ20లలో 98 మ్యాచులు ఆడి 1617 పరుగులు చేశాడు. 97 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 4,876 పరుగులు చేశాడు. ఆరు సెంచరీలు, 33 అర్ధసెంచరీలు కొట్టాడు. అదే సమయంలో వికెట్ కీపర్‌గా 294 అవుట్‌లను చేశాడు.

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. మ్యాట్నీ షోస్ వరకు వచ్చిన గ్రాస్...

Chennai Love Story: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ప్రీమియర్ షోస్ నుండి బ్లాక్...

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ బడ్జెట్ 38 కోట్లు.. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎన్ని కోట్లు...

Korean Kanakaraju: ప్రస్తుత ట్రెండ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం చాలా కష్టమైన విషయం గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కరీనా లాక్ డౌన్ సమయం లో నిర్మాతలకు నాన్...

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....
Oktelugu Epaper
Exit mobile version