Vaibhav Suryavanshi A celebration: ఐపీఎల్ లో భాగంగా లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో 38 బంతుల్లో 93 పరుగులు చేశాడు రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ. ఇతడు 38 బంతులలో 7ఫోర్లు, 10 సిక్సర్ల సహాయంతో విధ్వంసం సృష్టించాడు. ముఖ్యంగా హాఫ్ సెంచరీ అనంతరం ఈ బాల భీముడు సరికొత్త తీరుగా తన హాఫ్ సెంచరీని సెలబ్రేట్ చేసుకున్నాడు.
హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత తన చేతి వేళ్ళతో A సింబల్ చూపించాడు. అంతేకాదు సంబరాలు కూడా గట్టిగా చేసుకున్నాడు. దీంతో సోషల్ మీడియాలో చాలామంది సూర్య వంశీ A సెలబ్రేషన్ వెనుక ఉన్న అర్థమేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. అయితే చాలామందికి దాని వెనుక ఉన్నది ఏమిటో అర్థం కాలేదు. పైగా సూర్య వంశీ కూడా ఎటువంటి క్లూ ఇవ్వలేదు.
మ్యాచ్ ముగిసిన తర్వాత.. మెన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం అందుకున్న సూర్య వంశీ.. దాని వెనుక ఉన్న అసలు నిజాన్ని చెప్పేశాడు.. మొదట్లో వ్యాఖ్యాత మురళి కార్తీక్ అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేశాడు. తను ఏం చేశానో గుర్తుకు లేదని ఆట పట్టించాడు. ఆ తర్వాత ప్రతి మ్యాచ్లో కొత్త విధానాన్ని చూపించడానికి తాను ప్రయత్నిస్తానని సూర్య వంశీ వెల్లడించాడు. అయితే ఈసారి ఏ సింబల్ వెనుక ఉన్న అసలు విషయాన్నీ బయట పెట్టాడు. ఈ ఇన్నింగ్స్ తన మాతృమూర్తికి అంకితం ఇస్తున్నట్టు ప్రకటించాడు. తన పేరులో తొలి అక్షరం ఏ తో మొదలవుతుందని సూర్య వంశీ పేర్కొన్నాడు. సూర్య వంశీ వీరోచితమైన 93 పరుగుల ద్వారా రాజస్థాన్ జట్టు అద్భుతమైన విజయం సాధించింది. ప్లే ఆఫ్ ముందు సూపర్ విక్టరీ అందుకొని.. ఆశలను సజీవంగా ఉంచుకుంది. తదుపరి మ్యాచ్ ముంబై తో రాజస్థాన్ ఆడుతుంది. ఇందులో గెలిస్తే ప్లే ఆఫ్ వెళ్తుంది. ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు, గుజరాత్ ప్లే ఆఫ్ వెళ్లిపోయాయి.
