Homeఆధ్యాత్మికంSabarimala: శబరిమలలో ఆ రెండు ప్రాంతాలు ప్రమాదకరం.. ఎందుకంటే?

Sabarimala: శబరిమలలో ఆ రెండు ప్రాంతాలు ప్రమాదకరం.. ఎందుకంటే?

Sabarimala: చుట్టూరా ఎత్తైన కొండలు.. విస్తారంగా పారే నదులు.. అన్నిటికీ మించి పచ్చదనం.. కనుచూపుమేరా ఆహ్లాదకరమైన వాతావరణం.. ఇలా చెప్పుకుంటూ పోవాలి గాని శబరిమలై వర్ణన ఒక పట్టాన పూర్తికాదు. అందువల్లే ప్రతి ఏడాది శబరిమలై వెళ్లి.. అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలని భక్తులు ఆసక్తి చూపిస్తుంటారు. 41 రోజులు అత్యంత నిష్టగా దీక్ష చేసి.. అయ్యప్ప స్వామి సేవలో తరిస్తుంటారు.

అయ్యప్ప స్వామి ఆలయం ప్రకృతి ఒడిలో ఉంటుంది. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు దట్టమైన అడవిలో నడక మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. స్వామివారిని దర్శించుకోవాలనే తాపత్రయం ముందు ఈ కష్టం అంత పెద్దది కాదని అయ్యప్ప మాలదారులు అంటుంటారు. స్వామివారిని చూసిన తర్వాత ఈ కష్టాలు మొత్తం పెద్ద లెక్కలోకి రావని వారు అభిప్రాయపడుతుంటారు. అయ్యప్ప స్వామి దర్శనం సకల పాపాల హరణం అని మాలధారులు అభిప్రాయపడుతుంటారు.

అయ్యప్ప దర్శనం అద్భుతం అయినప్పటికీ.. ఇటీవల కాలంలో అక్కడ చోటుచేసుకుంటున్న సంఘటనలు భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా శబరిమల యాత్రికులకు రెండు చోట్ల గుండె పోటు ముప్పు పొంచి ఉండడం కలకలం రేపుతోంది. దీని అంతటికి ప్రధాన కారణం సముద్రమట్టానికి ఎత్తైన ప్రాంతంలోకి మాలదారులు వెళ్తుండడమే.. ఉపవాసాలు, నిర్జలీకరణ, ఆక్సిజన్ లభ్యత తక్కువ ఉండడం వల్ల ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా కేరళ వైద్య ఆరోగ్యశాఖ చెబుతుండడం విశేషం. పంపా బేస్ నుంచి శబరిమల వెళ్లే చిన్న పాదం మార్గంలో అత్యంత కఠినమైన మార్గంగా నీలిమల ప్రాంతం ఉంటుంది. కొండ శిఖరాగరంలో అప్పాచి మేడు వద్ద గుండెపోట్లు ఎక్కువగా సంభవిస్తున్నాయని కేరళ వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది.

ప్రతి ఏడాది నీలిమల, అప్పాచి మేడు ప్రాంతాలలో భక్తులకు గుండెపోట్లు వస్తున్నాయి. ట్రావెన్ కోర్ దేవస్యం, కేరళ వైద్య ఆరోగ్యశాఖ, పోలీస్ క్రైమ్ డేటా రికార్డ్ బ్యూరో గణాంకాల ప్రకారం గడిచిన ఏడు సంవత్సరాల లో చాలామంది మృతి చెందారు. 2017, 18 సీజన్లో 281 మంది గుండెపోటు బారిన పడగా.. ఇందులో 38 మంది చనిపోయారు. 2018, 19 కాలంలో 173 గుండెపోటు కేసులు నమోదయ్యాయి. ఇందులో 24 మంది చనిపోయారు. 2019, 20 కాలంలో 19, 2022, 23 కాలంలో 24 మంది, 2023, 24 కాలంలో 24 మంది, 2024, 25 కాలంలో 40 మంది గుండెపోటుతో చనిపోయారు. 2025, 26 సీజన్ ఇప్పటికే మొదలైంది. అయితే ఇందులో ఒక మహిళ గుండెపోటుతో చనిపోయింది. మరోవైపు ఒక జాతీయ ఆంగ్ల పత్రికలో 8 మరణాలు నమోదు అయినట్టు కథనం ప్రచురితమైంది. 2020,22 కాలంలో మాత్రం కోవిడ్ వల్ల పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించారు. ఆ సమయంలో ఎటువంటి గుండెపోటు మరణాలు నమోదు కాలేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version