ఈ రాశులపై ‘నవపంచమి యోగం’..వారి జీవితాల్లో కొత్త సంతోషం..

బృహస్పతి, కేతువు గ్రహాలు ఒకే స్థానంలోకి రావడంతో మిథున రాశిపై ప్రభావం చూపనుంది. ఈ సందర్భంగా ఈ రాశిగల వారికి అనుకూల ఫలితాలు ఉండనున్నాయి.

Written By: Chai Muchhata, Updated On : May 15, 2024 10:39 am

Horoscope Today

Follow us on

గ్రహాల మార్పులు కొన్ని రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. గ్రహాలకు అధిపతి అయినా బృహస్పతి, కేతువు కలిసి శుభ స్థానాలు ఉండే సమయం ప్రతీ వందేళ్లకు ఒకసారి వస్తుంది. త్వరలో నవపంచమి యోగం వల్ల ఈ రెండు ఒకే స్థానంలోకి రానున్నాయి. సాధారణంగా బృహస్పతి ప్రధాన గ్రహం.. కేతువు విభిన్న స్థానాల్లో ఉంటాయి. ఇవి అనుకూల స్థానాల్లోకి రావడం వల్ల కొన్ని రాశులకు శుభయోగం కలగనుంది. దీంతో ఆ రాశులు కలిగిన వారి జీవితాల్లో అనుకోని మార్పులు సంభవించనున్నాయి. ఇంతకీ ఆ రాశులు ఏవంటే?

బృహస్పతి, కేతువు గ్రహాలు ఒకే స్థానంలోకి రావడంతో మిథున రాశిపై ప్రభావం చూపనుంది. ఈ సందర్భంగా ఈ రాశిగల వారికి అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. వీరికి అనుకోని ఆదాయం వచ్చి చేరుతుంది. ఏ సమస్య ఎదురైనా ధైర్యంగా ముందుకు వెళ్తారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండగలుగుతారు.ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది.

నవపంచచి మోగం ప్రభావం వృషభ రాశిపై పడనుంది. దీంతో ఈ రాశి వారి జీవితంలో పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి. బకాయిలు వసూలవుతాయి. కొత్త పనిని ప్రారంభిస్తే సక్సెస్ అవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. వ్యక్తిగతంగా గుర్తింపు వస్తుంది.

మకర రాశిపై నవపంచమి యోగం ప్రభావం చూపనుంది. ఈరాశి ఉద్యోగులు ప్రమోషన్లు పొందుతారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. విదేశాలకు వెళ్లే వారికి అనుకూల ఫలితాలు. కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు.