Homeఆధ్యాత్మికంLord Shiva: ఈ శివాలయంలో శివుడు సంవత్సరంలో 28 రోజులు మాత్రమే కనిపిస్తాడు. ఆశ్చర్యపరిచే చరిత్ర

Lord Shiva: ఈ శివాలయంలో శివుడు సంవత్సరంలో 28 రోజులు మాత్రమే కనిపిస్తాడు. ఆశ్చర్యపరిచే చరిత్ర

Lord Shiva: ఆ మహాశివుడు గురించి ఎంతచెప్పినా తక్కువే. భక్తులకు అందుబాటులో ఉండేలా ఎన్నో ప్రాంతాల్లో ఆయన ఆలయాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా సరే శివమహత్యాలు కనిపిస్తుంటాయి. ఆ శివయ్య చెప్పనిదే చీమైనా కుట్టదు అంటారు. మరి ఆ శివయ్య ఆలయానికి వెళ్లడానికి ఎంతో మంది భక్తులు ఆసక్తి చూపిస్తారు. అయితే దక్షిణ భారతదేశంలో శివుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఇక్కడ అనేక శివాలయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి కేరళలోని కొట్టియూర్ శివాలయం. ఇక్కడి అక్కరే కొట్టియూర్ పురాతన శివాలయం హిందూ పురాణాలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. దాని ప్రత్యేకమైన మతపరమైన ఆచారాలు, పండుగలకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం అతిపెద్ద ప్రత్యేకత వైశాఖమోత్సవం అనే దాని వార్షిక పండుగ. అక్కరే కొట్టియూర్ శివాలయం చరిత్ర, ప్రాముఖ్యత, చరిత్రను తెలుసుకుందాం.

కొట్టియూర్ ఆలయ చరిత్ర
కొట్టియూర్ ఆలయ చరిత్ర మాతా సతి కథతో ముడిపడి ఉంది. ఈ పౌరాణిక కథ ప్రకారం, ఒకసారి మాతా సతి తండ్రి ప్రజాపతి దక్షుడు ఒక యాగం నిర్వహించినప్పుడు, ఆయన శివుడిని దానికి ఆహ్వానించలేదు. ఆ యాగం కుట్టియూర్ ఆలయ ప్రాంతంలోనే నిర్వహించారు.

Read Also: యూట్యూబ్ లో టీజర్స్ కి వచ్చేవి మొత్తం ఫేక్ వ్యూస్ అంటూ మరో బాంబు పేల్చిన దిల్ రాజు!

ఈ ఆలయానికి ‘కొట్టియూర్’ అనే పేరు ‘కత్తి-యూర్’ నుంచి ఉద్భవించిందని నమ్ముతారు. ఇది పురలిమల కట్టన్ రాజవంశంతో ముడిపడి ఉంది. ఈ ఆలయంలోని శివలింగం స్వయంభు (భూమి లోపల నుంచి స్వయంగా వ్యక్తమైంది). ఇది నది రాళ్లతో చేసిన ఎత్తైన వేదికపై ప్రతిష్టించారని నమ్ముతారు.

అక్కరే- ఇక్కరే కోటిత్తయ్యూర్ ఆలయం
బావలి నది ఒడ్డున అక్కరే కొట్టియూర్, ఇక్కరే కొట్టియూర్ ఆలయం అనే రెండు ఆలయాలు ఉన్నాయి. అక్కరే కొట్టియూర్ అనేది శివుని ఆలయం. ఇది వార్షిక వైశాఖ మహోత్సవం నిర్వహించే సమయంలో సంవత్సరంలో 28 రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది. ఈ సంవత్సరం కూడా చాలా మంది వైశాఖ మహోత్సవానికి హాజరయ్యారు.

Read Also: ఒక్క ఫోన్ చాలు మీ భాగస్వామి ఇల్లీగల్ రిలేషన్ తెలియజేయడానికి. మీరు ఎలా తెలుసుకుంటారంటే?

కొట్టియూర్ ఆలయంలో వైశాఖ మహోత్సవం ఎలా జరుపుకుంటారు?
కొట్టియూర్ ఆలయంలో 28 రోజుల పాటు జరిగే వైశాఖ మహోత్సవం, దేవతకు నెయ్యితో స్నానం చేయించడంతో ప్రారంభమవుతుంది. దీనిని నెయ్యట్టం అంటారు. వైశాఖమోత్సవం స్వామికి కొబ్బరి నీళ్లతో స్నానం చేయించడంతో ముగుస్తుంది. ఈ ఆచారాన్ని ఎలెనీరట్టం అంటారు. కొట్టియూర్ దేవాలయాల పునరుద్ధరణ ఆది గురు శంకరాచార్యుల కాలంలో జరిగింది. కొట్టియూర్ ఆలయంలో వార్షికంగా జరిగే వైశాఖమోత్సవం నియమాలను కూడా శంకరాచార్యులే రూపొందించారని చెబుతారు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version