Homeఆధ్యాత్మికంGaruda Purana Rules After Death: గరుడ పురాణం: చనిపోయిన వ్యక్తికి సాయంత్రం అంత్యక్రియలు ఎందుకు...

Garuda Purana Rules After Death: గరుడ పురాణం: చనిపోయిన వ్యక్తికి సాయంత్రం అంత్యక్రియలు ఎందుకు నిర్వహించరు?

Garuda Purana Rules After Death: గరుడ పురాణం జననం నుంచి మరణం వరకు పదహారు ఆచారాల గురించి వివరంగా వివరిస్తుంది. పదహారవ అంటే చివరి ఆచారం దహనం. దీనికి అనేక నియమాలు ఉన్నాయి. ఈ పురాణాన్ని మహర్షి వేద వ్యాసుడు రచించాడు. దీనిలో విష్ణువు, పక్షి రాజు గరుడుడి మధ్య సంభాషణ ఉంది. గరుడ పురాణం ప్రకారం మరణం తర్వాత కుటుంబం ఏమి చేయాలి? ఏమి చేయకూడదో చెబుతుంది. ఆత్మ ఎలా ప్రయాణిస్తుంది? ఎవరు స్వర్గాన్ని పొందుతారు? ఎవరు నరకానికి వెళతారు? జీవులకు ఏ ఆధారం మీద పునర్జన్మ లభిస్తుంది. మరణం తర్వాత సూర్యాస్తమయం తర్వాత అంత్యక్రియలు ఎందుకు చేయకూడదు? వంటి పూర్తి వివరాలు ఈ గరుడ పురాణంలో ఉంది. మరి దానికి కారణం ఏంటో మీకు ఎప్పుడు అనుమానం వచ్చిందా? అయితే ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో దాని గురించి తెలుసుకుందాం.

మనిషి చనిపోయిన తర్వాత కొన్ని గంటల్లోనే దహన సంస్కరణలు చేస్తారు. కానీ కొన్ని సార్లు మనిషి సాయంత్రం చనిపోతే అంత్యక్రియలు చేయరు. మరి దీనికి కారణం ఏంటి అనే వివరాలు చాలా మందికి తెలియదు. చాలా మంది ఈ ఆచారాన్ని పాటిస్తుంటారు.

స్వర్గ ద్వారాలు మూసివేస్తారు.
గరుడ పురాణం ప్రకారం, సూర్యాస్తమయం తర్వాత మృతదేహాన్ని దహనం చేయకూడదు. అలా చేయడం వల్ల ఆ వ్యక్తి ఆత్మకు శాంతి లభించదని చెబుతారు. అలాగే, సూర్యాస్తమయం తర్వాత స్వర్గ ద్వారాలు మూసివేస్తారని నమ్ముతారు. దీని కారణంగా ఆత్మ తన గమ్యస్థానాన్ని చేరుకోలేకపోతుంది.

సూర్యాస్తమయం తర్వాత నరకం ద్వారాలు తెరుచుకుంటాయి. అటువంటి పరిస్థితిలో, మరణించిన వ్యక్తిని రాత్రిపూట దహనం చేస్తే, ఆత్మ నరక బాధను అనుభవించాల్సి ఉంటుంది. తదుపరి జన్మలో, అలాంటి వ్యక్తి శరీర భాగాలలో దేనిలోనైనా లోపం ఉండవచ్చు. కాబట్టి, ఒక వ్యక్తి రాత్రిపూట కానీ సాయంత్రం కానీ మరణిస్తే వారిని సాయంత్రమే దహనం చేయకుండా ఉదయం వరకు వేచి ఉంచి ఉదయం దహనం చేస్తుంటారు. కానీ కొందరు కాస్త సమయం ఉన్నా సరే వెళ్లి వెంటనే అంత్యక్రియలు నిర్వహిస్తుంటారు.

Also Read:  Pawan Kalyan- Garuda Puranam Sivaji: హీరో శివాజీ గరుడ పురాణంలో చెప్పిందే జరుగుతోంది.. త్వరలో పవన్‌ సీఎం!

దహన సంస్కారాలు ఎవరు చేయవచ్చు?
ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తి మృతదేశాన్ని సూర్యోదయం వరకు నేల మీద ఉంచాలి అంటోంది గరుడ పురాణం. ఉదయం, అంత్యక్రియలు సరైన ఆచారాలతో నిర్వహించాలి. దీన్ని ఇంట్లోని కుమారుడు, తండ్రి, మనవడు వంటి వారు ఎవరైనా చేయవచ్చు. గరుడ పురాణం ప్రకారం అంత్యక్రియల ఆచారాలు వంశపారంపర్య సంప్రదాయంలో ఒక భాగం. కాబట్టి, జీవితాంతం వంశపారంపర్యంగా సంబంధం కలిగి ఉన్న వ్యక్తులకు మాత్రమే ఈ ఆచారాలను నిర్వహించే హక్కు ఉంది.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version