Goddess Lakshmi: ఈ చిన్న పరిహారాలు పాటించి లక్ష్మీదేవినీ ప్రసన్నం చేసుకోవడం వలన కోటీశ్వరులు అవచ్చు…ఆ పరిహారాలు ఇవే..

Goddess Lakshmi: లక్ష్మి దేవి ఉంటేనే దేవతలా ఆశీర్వాదం కూడా ఉంటుంది అని అందరు అంటూ ఉంటారు.అలాంటి లక్ష్మి దేవి నీ ప్రసన్నం చేసుకోవాలి అంటే ఏం చేయాలి.ఏం చేస్తే ఆర్ధిక సమస్యలు దూరం అయ్యి డబ్బు ఇంట్లో నిలువ ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Written By: Chai Muchhata, Updated On : జూలై 11, 2024 2:18 సా.

Goddess-Lakshmi

Follow us on

Goddess Lakshmi: మనిషి జీవితం లో డబ్బు ప్రధాన పాత్ర వహిస్తుంది.చేతి లో డబ్బు లేకపోతే ఏ పని కూడా పూర్తి అవ్వదు.అలాంటి డబ్బు సంపాదించటానికి మనిషి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.అయితే కొంత మంది ఎంత డబ్బు సంపాదించినా కూడా వారి ఇంట్లో డబ్బు నిలవదు.చాలా మంది ఆర్ధిక సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు.లక్ష్మి దేవి ఉంటేనే దేవతలా ఆశీర్వాదం కూడా ఉంటుంది అని అందరు అంటూ ఉంటారు.అలాంటి లక్ష్మి దేవి నీ ప్రసన్నం చేసుకోవాలి అంటే ఏం చేయాలి.ఏం చేస్తే ఆర్ధిక సమస్యలు దూరం అయ్యి డబ్బు ఇంట్లో నిలువ ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటిస్తే డబ్బు ఇంట్లో నిలుస్తుంది అని నిపుణులు చెప్తున్నారు.బిర్యానీ ఆకుతో పరిహారం చేస్తే ఆర్ధిక సమస్యలు దూరం అయ్యి డబ్బు ఇంట్లో నిలుస్తుంది.అలా బిర్యానీ ఆకు తో పరిహారం చేయడానికి ఇంటి ఇల్లాలు ఉదయాన్నే నిద్ర లేచి తల స్నానం చేసి ఇంట్లో ఉన్న పూజ గది లో ఉన్న లక్ష్మి దేవి పటం ముందు ఒక బిర్యానీ ఆకును ఉంచి ఆ ఇల్లాలు పూజ చేయాలి.అయితే ఆ బిర్యానీ ఆకు వంటింట్లో ఉన్నది కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్ గా కొన్నదై ఉండాలి.ఇలా పూజ చేసిన బిర్యానీ ఆకును జేబు లో లేదా పర్సు లో ఉంచుకున్నట్లయితే లక్ష్మి దేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అని నిపుణులు చెప్తున్నారు.చాలా మంది ఇల్లు కట్టుకోవడానికి స్థలం కొంటారు కానీ వాళ్లకు ఇల్లుకట్టునే అంత డబ్బు చేతిలో ఉండదు.

అలా తాము కొన్న స్థలం లో ఇల్లు కట్టుకోవాలి అని ఆలోచించేవారు శుక్రవారం రోజున మట్టి తో తయారు చేసిన ఒక నీటి కుండను తెచ్చుకొని ఇంటి ఈశాన్య దిశలో పెట్టుకోవాలి.ఇలా ఇంటి ఈశాన్య దిశలో మట్టి కుండను ఉంచటం వలన లక్ష్మి దేవి అనుగ్రహం కలిగి ధన ప్రాప్తి కలుగుతుంది అని నిపుణులు సూచిస్తున్నారు.ఇలా చేయడం వలన తాము కొన్న స్థలంలో ఇంటిని నిర్మించుకోవడానికి ధనం చేకూరుతుంది.కొంత మంది ఇంటి లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చేస్తారు.అలా ఇంట్లోకి రావడం వలన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది.ఇంట్లో అనారోగ్య సమస్యలు,ఆర్ధిక సమస్యలు చుట్టూ ముడతాయి.అందుకని ప్రతి ఒక్కరికి ఇంట్లోకి వచ్చే ముందు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాలి అని చెప్పాలి.అలాగే ఇంట్లో తులసి మొక్కను పూజించడం వలన కూడా లక్ష్మి దేవి అనుగ్రహం కలిగి ఆర్ధిక సమస్యలు తొలగిపోతాయి.సాక్షాత్తు లక్ష్మి దేవి తులసి మొక్కలో నివసిస్తుంది అని నిపుణులు చెప్తున్నారు.

అలాంటి తులసి ఆకులను అయిదు తీసుకోని ఎర్రటి గుడ్డలో పెట్టి బీరువాలో పెట్టుకోవాలి.ఇలా చేయడం వలన ఆర్ధిక సమస్యలు అన్ని తొలగిపోయి ఇంట్లో డబ్బు నిలుస్తుంది.వచ్చే ఆదాయానికి మించి మీరు డబ్బు ఖర్చు చేస్తున్నాము అని మీకు అనిపించినట్లయితే మీ కాలికి నల్ల దారాన్ని కట్టుకోవాలి.ఇలా నల్ల దారం కట్టుకోవడం వలన ఆర్ధిక సమస్యలు రావు.అలాగే నర దిష్టి కూడా మీకు తగలదు.అయితే మహిళలు ఎడమ కాలికి మరియు పురుషులు కుడి కాలికి నల్ల దారాన్ని కట్టుకోవడం మంచిది అని నిపుణులు చెప్తున్నారు.ప్రతి రోజు పూజ చేయడం కుదరకపోయిన సోమవారం రోజున పూజ చేస్తే దేవతలందరి ఆశీస్సులు కలుగుతాయి అని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు.దేవతలందరు ఆరాధించే శివుడికి సోమవారం అంటే ఇష్టం కాబట్టి ఆ రోజున పూజ చేసే దేవతలందరి ఆశీర్వాదం కలుగుతుంది.కొంత మందికి ఇంట్లో మంచం పైన భోజనం చేసే అలవాటు ఉంటుంది.ఇలా చేయడం వలన ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం కరిగిపోయి ఆర్ధిక సమస్యల బారిన పడతారు.