Homeఆధ్యాత్మికంAre you going to Shirdi: షిర్డి వెళ్తున్నారా? నియమాలు మార్చారు ఒకసారి చెక్ చేసుకోండి.

Are you going to Shirdi: షిర్డి వెళ్తున్నారా? నియమాలు మార్చారు ఒకసారి చెక్ చేసుకోండి.

Are you going to Shirdi: షిర్డి సాయి బాబా ఆస్థానానికి వెళ్లాలంటే ఆ బాబా ఆశీస్సులు తప్పకుండా ఉండాలి. బాబా ఆశీస్సులు ఉంటేనే షిర్డీ వెళ్లగలం అని నమ్ముతారు భక్తులు. అయితే మీరు షిర్డి వెళ్లాలి అనుకుంటున్నారా? ప్రస్తుతం మహారాష్ట్రలోని షిర్డీలోని సాయిబాబా ఆస్థానంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దేశ, విదేశాల నుంచి ప్రతిరోజూ వేలాది మంది ఇక్కడికి చేరుకుంటారు. ఈ భక్తుల కోసం సాయి సంస్థ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. సాయి ఆలయంలో బ్రేక్ దర్శనం ప్రారంభించనున్నారు. ఇది సాధారణ దర్శన వరుసలో నిలబడి ఉన్న భక్తులకు ప్రయోజనం చేకూరుస్తుంది.

వీఐపీల దర్శన సౌకర్యం
జనసమూహం మధ్య సరైన వ్యవస్థను నిర్వహించడానికి సాయి బాబా సంస్థానం బ్రేక్ దర్శనం ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందులో, VIP, VVIP దర్శన సౌకర్యానికి సమయం నిర్ణయించారు. శ్రీ సాయి బాబా సంస్థాన ట్రస్ట్ ప్రస్తుత CEO (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) గోరక్ష గధిల్కర్ ఈ నిర్ణయాన్ని తెలిపారు.

Read Also: వామ్మో వర్షాకాలం.. తప్పకుండా తేనెను ఇలా ఉపయోగించండి

సాయి ఆలయాన్ని సందర్శించే వారిలో వీఐపీలు, వీవీఐపీ భక్తులు కూడా ఉంటారని, వీఐపీ సాయి భక్తులకు దర్శన ఏర్పాట్లు రోజంతా అందుబాటులో ఉంటాయని తెలిపారు గోరక్ష గధిల్కర్. వీఐపీ దర్శన సమయంలో, సాధారణ దర్శనం కోసం భక్తుల వరుస నిలిపివేయాల్సి వస్తుంది. ఈ భక్తులు రెండు-మూడు గంటలు వేచి ఉంటారు. దీనివల్ల వారు సరిగ్గా దర్శనం చేసుకోలేకపోతున్నారు. వీఐపీ భక్తులు కూడా సరిగ్గా దర్శనం చేసుకోలేకపోతున్నారు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారట.

వీఐపీ భక్తులకు ‘బ్రేక్ దర్శన్’ సౌకర్యం ప్రారంభం
“ప్రస్తుతానికి, వీఐపీ భక్తుల కోసం ‘బ్రేక్ దర్శనం’ సౌకర్యాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. వీఐపీ భక్తులు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 3:30 గంటల వరకు, రాత్రి 8 నుంచి 8:30 గంటల వరకు దర్శనం చేసుకోగలరు. ఈ సమయంలో సాధారణ దర్శనం లైన్ కూడా కొనసాగుతుంది” అని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తెలిపారు. వీవీఐపీలు, విరాళం ఇచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసినట్లు ఆయన చెప్పారు. ఈ భక్తులకు ‘బ్రేక్ దర్శనం’ నుంచి మినహాయింపు ఇస్తారట.

సాధారణ దర్శనం లైన్‌లో 2-3 గంటలు వేచి ఉన్నా సరే వారు సరిగ్గా దర్శనం చేసుకోలేకపోతున్నారని గోరక్ష గధిల్కర్ అన్నారు. ఇది జరగకూడదనే ఈ ‘బ్రేక్ దర్శనం’ నిర్ణయం తీసుకున్నారు. సాధారణ లైన్‌లో వేచి ఉన్న భక్తులకు, వీఐపీ భక్తులకు కూడా ప్రయోజనం చేకూర్చడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మరి మీరు కూడా ఈ సారి వెళ్తే సమయం చూసుకొని వెళ్లండి.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular