Homeజాతీయ వార్తలు"దీపం పిలుపు" వెనుక అసలు రహస్యం.. ఇదేనా?

“దీపం పిలుపు” వెనుక అసలు రహస్యం.. ఇదేనా?

కరోనావైరస్ వ్యాప్తికి వ్యతిరేకంగా, ప్రజా ఐక్యతకు సూచనగా, జాతీయ పోరాటానికి గుర్తుగా ఆదివారం (ఏప్రిల్ 5) రాత్రి 9 గంటలకు ఇంట్లో ఉన్నఎలెక్అట్ర్ర్ఈఈకాల్ లైట్లను మరియు లైట్ కొవ్వొత్తులు లేదా డయాస్ లేదా తమ మొబైల్ ఫోన్లలో ఫ్లాష్ లైట్లను ఉపయోగించాలని పిఎం మోడీ కోరారు.కరోనావైరస్ వ్యాప్తికి వ్యతిరేకంగా, ప్రజా ఐక్యతకు సూచనగా, జాతీయ పోరాటం గుర్తుగా ఆదివారం (ఏప్రిల్ 5) రాత్రి 9 గంటలకు ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ లైట్లకు ఆర్పేసి వాటికి బదులుగా కొవ్వొత్తులు, దీపాలు లేదా మొబైల్ ఫోన్లలో ఫ్లాష్ లైట్లను ఉపయోగించాలని పిఎం మోడీ కోరారు.

ఏప్రిల్ 5 ఎందుకు? రాత్రి సమయం ఎందుకు? దీని ప్రత్యేకత ఏమిటి?

హిందు క్యాలెండర్‌ ప్రకారం ప్రతి నెలా ప్రదోష్ వ్రతం లేదా ప్రడోశం రెండుసార్లు వస్తుంది. ఈ క్రమంలో ఏప్రిల్ లో ప్రదోష్ వ్రతం ఏప్రిల్ 05, ఆదివారం. ప్రడోషా పూజ సమయం:
Apr 05, 6:40 PM – 8:59 PM. ఇదే నెలలో ఏప్రిల్ 20న మరోసారి కూడా వస్తుంది.

రాత్రి 9గంటలకు పూజ ముగుస్తోంది. పూజ తరువాత, చాలా మంది భక్తులు దర్శనం కోసం శివుని ఆలయాలను సందర్శిస్తారు. ప్రదోషం రోజున ఒక్క దీపమైన వెలిగించడం చాలా మంచిదని అని నమ్ముతారు. కాబట్టి, రాత్రి 9 గంటలకు దీపం వెలిగించమని కోరతారు. ఈ రోజు రాత్రి 9గంటలకు మోడీ అదే పిలుపును ఇవ్వడం గమనార్హం.

కరోనా ని పారదోలే క్రమంలో ప్రజలందరికీ మంచి జరగాలని ఆలోచించి దేశ ప్రధానిగా మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారా..? లేక ఒక ఆచారంగా భావించి దేశానికి ఈ పిలుపునిచ్చారా..? అనేది అప్రస్తుతం. కరోనా వ్యాప్తితో భయబ్రాంతులకు గురయ్యే వారికి, ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాం.. అనుకునే వారికి మోడీ “దీపం”పిలుపు ఎంతో కొంత ధైర్యాన్ని ఇస్తుందని భావిద్దాం..!

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version