
దేశంలో రైల్వే జోన్లు డివిజన్ల సంఖ్య తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈమేరకు వాటి పునర్విభజన, హేతుబధ్దీకరణ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ లోక్ సభలో ఓ లిఖిత పూర్వక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. 2014 లో బిబేక్ డెబ్రాయ్ నేతృత్వంలో ఓకమిటిని ఏర్పాటుచేశామని ,32 సిపార్సులతో 2015 లో కమిటి నివేదిక సమర్పించిందన్నారు. వాటిలో కోన్నింటిని ఇప్పటికే అమల్లోకి తీసుకోచ్చామని మరికొన్నింటిపై కసరత్తులు జరుపుతున్నామని వెల్లడించారు.
Also Read: భీవండి ఘటనలో 20కు చేరిన మృతుల సంఖ్య