జంటనగరాల్లో పార్కులే కూరగాయల మార్కెట్లు!

హైద్రాబాద్, సికింద్రాబాద్ లోని కొన్ని పార్కులను కూరగాయల మార్కెట్లుగా మారుస్తున్నట్లు సమాచారం. కరోనా ప్రభలుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 21 రోజుల సంపూర్ణ లాక్ డౌన్ ను అమలుపరుస్తున్నాయి. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి ప్రజలు గుమి గూడే ప్రాంతాలలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జంట నగరాలలో పలు పార్కులను కూరగాయ మార్కెట్లుగామారుస్తున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ లోని రైళ్ళను ఐసోలాషన్ వార్డ్స్ గా మార్చిన విషయం తెలిసిందే.. […]

Written By: Neelambaram, Updated On : March 31, 2020 5:15 pm
Follow us on

హైద్రాబాద్, సికింద్రాబాద్ లోని కొన్ని పార్కులను కూరగాయల మార్కెట్లుగా మారుస్తున్నట్లు సమాచారం. కరోనా ప్రభలుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 21 రోజుల సంపూర్ణ లాక్ డౌన్ ను అమలుపరుస్తున్నాయి. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి ప్రజలు గుమి గూడే ప్రాంతాలలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జంట నగరాలలో పలు పార్కులను కూరగాయ మార్కెట్లుగామారుస్తున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ లోని రైళ్ళను ఐసోలాషన్ వార్డ్స్ గా మార్చిన విషయం తెలిసిందే..

ఆ నేపథ్యంలోనే నాంపల్లి లో ఉన్న ఉప్పల్ స్టేడియంను కూరగాయల మార్కెట్లుగా మారుస్తున్నట్లు జీహెచ్ఎంసీ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కృష్ణ శేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గోపు సరస్వతి సదానంద్ మాట్లాడుతూ.. స్టేడియంలో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయడం వల్ల సామాజిక దూరం పాటిస్తూ కూరగాయలు కొనుగోలు చేయడానికి ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్నారు.