
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ నెల చివరిలో భారత్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.. ట్రంప్ కి ఘన స్వాగతం చెప్పేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధమౌతోంది. నమస్తే ట్రంప్(కేమ్ ఛో ట్రంప్) పేరుతో రాజస్థాన్ లోని “మోటేర స్టేడియం” లో ఘన స్వాగతం పలకనుంది మోడీ సర్కార్.
అయితే ట్రంప్ ప్రయాణించే.. మార్గంలో మోడీ గవర్నమెంట్ ఒక వినూత్నమైన పనిని తలపెట్టింది. రోడ్డుకి రెండువైపులా పెద్ద పెద్ద బ్యానర్స్ తో స్వాగత బోర్డులను ఏర్పాటు చేస్తుంది. అలాగే కొన్ని ప్రదేశాలలో ఉన్న గోడలకు రంగులతో ముస్తాబు చేస్తుంది. మరి కొన్ని చోట్ల మూరికి వాడలు కనిపించకుండా ఏకంగా గోడ కట్టి, సర్వాంగ హంగులతో ముస్తాబు చేస్తుంది.
మురికి వాడలు కనిపించకుండ గోడలు కట్టడాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఆ గోడకి ఉపయోగించే డబ్బుతో.. అక్కడున్న ప్రజలకు నివాసాలను ఏర్పాటు చేయవచ్చనేది అనేకమంది విశ్లేషకుల అభిప్రాయం.