
శాసన మండలిలో వీకేంద్రీకరణ, సిఆర్డిఏ రద్దు వంటి బిల్లులు వీగిపోతాయని జగన్ కి ముందే తెలుసు…జగన్ వ్యూహంలోనికి చంద్రబాబు నెమ్మదిగా చిక్కుకుంటున్నాడు.. తన వేళ్లతో తన కళ్లు పొడుచుకోనే సమయం చంద్రబాబుకు మరెంతో దూరంలో లేదనేది నమ్మలేని నిజం. తాజాగా ఈ బిల్లు ను మంత్రి మండలిలో వీగకుండా నిలువరించగలిగే సత్తా అధికార పక్షానికి ఉన్నప్పటికీ కూడా ఆ పని చేయకుండా ఎంతో ఆలోచనకు పదును పెట్టింది.వీగిపోయిన బిల్లు ఆనందం చంద్రబాబు అండ్ కో కు తాత్కాలిక హర్షాన్ని తెచ్చిపెట్టినట్లే.
ఎందుకంటే మూడు చోట్ల రాజధాని ఏర్పాటు విషయ ప్రచారం ఫలితంగా ఆ మిగతా రెండు చోట్లా విశాఖ,కర్నూల్ లో టీడీపీ పరిస్థితి డైలమాలో పడ్డట్లే. రాజధానిలో భారీ భూ అక్రమాలు జరిగినట్లు దానికి విచారణ కమిటీ వేయనున్నట్లు ఇప్పటికే అధికార వైసీపీ ప్రకటించింది. అమరావతి తప్ప మరెక్కడా రాజధాని వద్దన్న బాబు నిర్ణయం వెనుక భారీ భూపందేరమే కారణమన్న విషయాన్ని ఇప్పటికే యావత్ దేశవ్యాపితంగా చర్చలు కు వైసీపీ పునాదులు వేసేసింది..
Read More:తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఎన్టీఆర్ బాటలో జగన్?
మూడు రాజధానులు మేము స్వాగతిస్తే టీడీపీ అడ్డు పుల్ల వేస్తోందన్న ప్రచారానికి మరింత ఊపు తెచ్చేవిదంగా వైసీపీ శ్రేణులు సిద్ధపడిపోయారు…ఎంతో వ్యూహ చతురత కలిగిన బాబుకు ఇవన్నీ తెలిసినా కూడా ఓ వైపు అమరావతి నామం జపించక తప్పదు…ఆయన వద్ద సంధించడానికి బాణాలున్నా సరే వాటికి పదును తక్కువైనది…అంతిమంగా జగన్ పన్నిన వ్యూహంలో చంద్రబాబు చిక్కుకున్నారని అందరి అభిప్రాయం..కేవలం తాత్కాలిక విజయం బాబు సొంతమైతే శాశ్వత విజయానికి జగన్ తెర వెనుక నుంచి బాటలు సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాడు… అందుకే ఓడినట్లే ఆడుతూ ఆటలో మజా చూపిస్తున్నాడు.