Homeమిర్చి మసాలాఅసెంబ్లీలో జగన్ పక్కన రాపాక... చూసినవారందకీ షాక్..

అసెంబ్లీలో జగన్ పక్కన రాపాక… చూసినవారందకీ షాక్..

 

జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు తొలిరోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ పక్కన కూర్చున్నారు. ఈ ఆసక్తికర సన్నివేశం చుసిన అసెంబ్లీ నాయకులందరూ ఆశ్చర్యపోయారు. ఎమ్మెల్యే రాపాక సీఎం జగన్ తో కొద్దిసేపు మాట్లాడారు.. ఇద్దరూ సీరియస్‌గా ఏదో చర్చించినట్లు కనిపించింది. సభ జరుగుతున్న సమయంలో జరిగిన ఈ సన్నివేశం చర్చనీయాంశమయ్యింది. సీఎంతో ముచ్చటించిన తర్వాత మళ్లీ వెళ్లి.. ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తన స్థానంలో కూర్చున్నారు.

 

ఇప్పటికే ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు జగన్ పరిపాలన బాగుందని… అంటూ , జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయానికి తన మద్దతు ప్రకటిస్తూ.. జనసేనకి ఒక ప్రశ్నలాగా తయారయ్యాడు. జనసేన వ్యతిరేకిస్తున్న అత్యంత కీలకమైన మూడు రాజధానుల నిర్ణయానికి కూడా మద్దతు పలికారు. అసెంబ్లీకి బిల్లు వస్తే అనుకూలంగా ఓటు వేస్తానని చెప్పుకొచ్చారు. ఆయన నిర్ణయం అలా ఉంటే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్యేకు షాకిచ్చారు.. ఆయనకు లేఖ రాశారు. ఆ లేఖలో.. రాజధాని నిర్మాణం అమరావతిలోనే కొనసాగాలని, ప్రభుత్వ పాలన సంపూర్ణముగా అమరావతి నుంచే కొనసాగాలని, అభివృద్ధి వికేంద్రీకరణ బరగాలని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలని జనసేన పార్టీలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది అన్నారు.

 

జనసేన పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఎమ్మెల్యే రాపాక శాసనసభ సమావేశాలకు హాజరై.. ఏపీ అసెంబ్లీలో ఏపీ డిసెంట్రలైజేషన్‌ అండ్‌ ఈక్వల్‌ డెవలప్‌మెంట్ రీజియన్‌ యాక్ట్‌ 2020, అమరావతి మెట్రో డెవలప్‌మెంట్ యాక్ట్ 2020 బిల్లుల్ని ప్రవేశపెట్టే సమయంలో.. ఓటింగ్ సమయంలో వ్యతిరేకించవలసిందిగా కోరుతున్నాను అన్నారు. మరి అసెంబ్లీలో ఎమ్మెల్యే రాపాక బిల్లకు మద్దతుగా ఓటు వేస్తారా.. పార్టీ అభిప్రాయాన్ని గౌరవిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version