కరోనా వచ్చాక మనిషి జీవితం మారిపోయింది. మన రోజువారీ పనులతో పాటు మనల్ని ఎంటర్ టైన్ చేసే వ్యవస్థలు కూడా పూర్తిగా మారిపోయాయి. అందులో భాగంగా సినీ రంగంలో పరిస్థితులు కూడా పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం జనాలు అందరూ ఓటీటీలకు బాగా కనెక్ట్ అయ్యారు అంటే.. దానికి ఏకైక కారణం కరోనానే. ఈ కరోనా కాలంలో హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ ‘ఆహా’ ప్లాట్ ఫాం వెరైటీ ప్రోగ్రాంస్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే కొన్ని స్పెషల్ షోలను అందిస్తోంది ఆహా. కొత్త సినిమాలు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్లతో తెలుగు ప్రేక్షకులను బాగా అలరిస్తున్న ఆహా మాధ్యమం.. సమంత హోస్ట్ గా సామ్ జామ్ అనే కార్యక్రమాన్ని కూడా బాగానే ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.
Also Read: మోహన్ బాబు నటప్రస్థానానికి నేటితో 45ఏళ్లు పూర్తి..!
ఈ సామ్ జామ్ స్పెషల్ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం సమాజంలోని సమస్యల గురించి ప్రశ్నించడం, కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయడం.. అందుకు ప్రత్యేకంగా కసరత్తులు చేస్తోంది టీమ్. ఇక ఇటీవల మొదలైన సామ్ జామ్ ఎపిసోడ్కు మొదట విజయ్ దేవరకొండ హాజరయ్యాడు. ఎలాగూ విజయ్ దేవరకొండకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి.. ఈ షో కోసం విజయ్ ని ప్రత్యేకంగా ఆహ్వానించి.. మొత్తానికి ఈ షోకి బాగానే క్రేజ్ ను తెచ్చారు ఆహా మేనేజ్మెంట్. ఇక షోలో ఈ కుర్ర హీరో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. షోలో నాతో నటించిన హీరోయిన్స్ లో.. సమంతని తప్ప అందరు హీరోయిన్స్ని ముద్దు పెట్టేసా అని చెప్పి మొత్తానికి తన శైలి కామెంట్స్ తో రెచ్చిపోయాడు.
Also Read: బాలయ్యకి ఓ నిర్మాత కావాలి !
ఇక ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా సామ్ జామ్ కార్యక్రమానికి హోస్ట్గా హాజరు కాగా, ఆయనకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేశాయి. ఇది కూడా షోకి బాగా ఉపయోగపడింది. ఇక రెండో ఎపిసోడ్లో ఎవరు హాజరు అవుతారా అని అంతా ఆశగా ఎదురు చూస్తున్న క్రమంలో మహానటితో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న నాగ్ అశ్విన్, బాహుబలి సినిమాతో తన క్రేజ్ని దేశ విదేశాల వరకు తీసుకెళ్ళిన భళ్ళాల దేవుడు రానా సామ్ జామ్ కి రాబోతున్నారు అనే సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. మరి వీరిద్దరితో సమంత ఎలాంటి గేమ్స్ ఆడిస్తుందో.. ఎలాంటి ప్రశ్నలు అడుగుతుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్