ఎన్నికలు వస్తుండడంతో ఏపీ సీఎం జగన్ ‘కాపురాల’ గొడవ మొదలుపెట్టారు. 2019 ఎన్నికలకు ముందు ఇదే కాపురం గొడవ ప్రచారం చేశాడు. అమరావతిలో తాను కాపురం పెడుతున్నానని.. చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చున్నాడు అంటూ ప్రజలను మోసం చేశాడు. ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందు ఈ సెప్టెంబర్ లో విశాఖలో కాపురం పెడుతాడట..
ప్రజల సొమ్ముతో.. పన్నులు కట్టేవారి కష్టంతో ప్రభుత్వం సీఎంలకు అన్ని వసతులు కల్పిస్తుంది. ఇది పెద్ద అంశమే కాదు.. ప్రజలకు ఏది చెప్పాలి? ఏది చెప్పకూడదన్నది జగన్ కు తెలియడం లేదు. మళ్లీ జగన్ విశాఖకు వెళుతున్నానంటూ కాపురాల గొడవ మొదలుపెట్టారు.
ఎన్నికల ముందు ఏం చెప్పినా నీటిమూటలు తప్పితే అది నిజమైన మాట కాదు. ఐదు సంవత్సరాలు రాజధాని మీదే గడిపిన రికార్డ్ సృష్టించిన పేరు జగన్ కు వస్తోంది. ఐదేళ్లు రాజధాని లేకుండా గడుపుతారా? తాత్కాలిక రాజధాని అంటూ నడిపిస్తారా? అన్నది జగన్ సమాధానం చెప్పాలి. అసలు జగన్ ఇలాంటి స్టేట్ మెంట్లు ఎందుకు ఇస్తున్నారన్నది తెలుపాలి.
జగన్ కాపురాల గొడవపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.