https://oktelugu.com/

Palaniswami : అమిత్ షా ఇంటికెళ్ళి పళనిస్వామి మంతనాలు

Palaniswami: అమిత్ షా ఇంటికెళ్ళి పళనిస్వామి మంతనాలు.. తమిళనాడులో జరిగే పరిణామాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: , Updated On : March 26, 2025 / 12:34 PM IST

Palaniswami : ఢిల్లీలో చాలా సంచలన పరిణామం నిన్న జరిగింది. ఈపీఎస్.. ఈ ఫళనిసామీ అనే అన్నాడీఎంకే లీడర్ అకస్మాత్తుగా అమిత్ షాను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అన్నాడీఎంకేకు, ఫళనిస్వామికి సంబంధాలు బాగా లేవు. తన అనుచర గణంతో చడీచప్పుడు లేకుండా ఈపీఎస్ కలవడం సంచలనమైంది.

దీనిపై డీఎంకే, స్టాలిన్ ఉలిక్కిపడ్డాడు. ఈ భేటి ప్రాధాన్యత సంతరించుకుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, వీరిద్దరూ రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలోని పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రానున్న ఎన్నికలు, పొత్తుల గురించి వారు మాట్లాడుకున్నారని భావిస్తున్నారు. తమిళనాడులో బీజేపీతో అన్నాడీఎంకే పొత్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

ఈ భేటీ అనంతరం ఇరువురు నేతలు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, ఈ సమావేశం ఇరు పార్టీల మధ్య సత్సంబంధాలను మరింత బలపరుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

పళనిస్వామి అమిత్ షాతో భేటీ కావడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ పలు సందర్భాల్లో వారు సమావేశమయ్యారు. అయితే, తాజా భేటీ రానున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో ఈ భేటీ ఎలాంటి మార్పులకు దారితీస్తుందో వేచి చూడాలి.

అమిత్ షా ఇంటికెళ్ళి పళనిస్వామి మంతనాలు.. తమిళనాడులో జరిగే పరిణామాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

అమిత్ షా ఇంటికెళ్ళి పళనిస్వామి మంతనాలు || Palaniswami meets Amit Shah in Delhi || Ram Talk