Homeరామ్స్ కార్నర్రామ్ టాక్Kashmir Elections : కాశ్మీర్ లోయలో ఎన్నికల సమరం మొదలు కాబోతుంది

కాశ్మీర్ లోయలో ఎన్నికల సమరం మొదలు కాబోతుంది

Kashmir Elections : ఎట్టకేలకు కశ్మీర్ లోయలో ఎన్నికల సమరం మొదలైంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత మొట్టమొదటి పరీక్షను ప్రభుత్వం ఎదుర్కోబోతోంది. ఇది అతిపెద్ద సమస్య. రెండు భావాల మధ్య జరుగుతున్న ఎన్నికలవి.. కాశ్మీర్ ఓటర్ల తీర్పు అత్యంత కీలకంగా మారనుంది.

జమ్మూలో ఎన్నికలు అయిపోయాయి. శ్రీనగర్ లో 13, 20వ తేదీన బారాముల్ల, 25న అనంత్ నాగ్ , రాజోలిలో జరుగబోతున్నాయి. ఈ ఎన్నికలు ఆర్టికల్ 370 రద్దు తర్వాత కీలకంగా మారాయి. కశ్మీర్ ప్రత్యేకమైనది అని.. దేశంలో అంతర్భాగం కాదని అక్కడి పార్టీలు రెచ్చగొడుతున్నాయి.

కశ్మీర్ లోయలో రెండు జాతీయ పార్టీలు పోటీ చేయడం లేదు. బీజేపీ, కాంగ్రెస్ లు పోటీకి దూరంగా ఉన్నాయి. కేవలం ప్రాంతీయ పార్టీలే కశ్మీర్ లోయలో పోటీచేస్తున్నాయి.

ఇందులో నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, అప్నీ పార్టీ, గులాంనబీ ఆజాద్ పార్టీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీలు ఎవరికి వారు పోటీలో ఉన్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలకు కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నాయి. అప్నీ పార్టీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ కలిసి పోటీచేస్తున్నాయి. గులాం నబీ పార్టీ సొంతంగా పోటీచేస్తోంది. బీజేపీ పరోక్షంగా అప్నీ పార్టీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ లకు మద్దతు ఇస్తోంది.

కాశ్మీర్ లోయలో ఎన్నికల సమరం ఎలా ఉండబోతోందన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
RELATED ARTICLES

Most Popular