Congress : ఒక నాయకుడు పరీక్ష పేపర్లపై కుల వ్యాఖ్యలు చేస్తే మరో నాయకుడు జాతుల పేరుతో వ్యాఖ్యలు చేస్తాడు

ఒక నాయకుడు పరీక్ష పేపర్లపై కుల వ్యాఖ్యలు చేస్తే మరో నాయకుడు జాతుల పేరుతో వ్యాఖ్యలు చేస్తాడు. కాంగ్రెస్ నేతల విద్వేష వ్యాఖ్యలపై ‘రామ్’  గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : May 9, 2024 6:17 pm

Congress : కాంగ్రెస్ కు వేరే ప్రత్యర్థులు అవసరం లేదు. వాళ్లకు వాళ్లే ప్రత్యర్థులు.. పార్టీని ఎలా నాశనం చేసుకోవాలో వాళ్లకు తెలిసినట్టుగా ఇంకా ఎవరికీ తెలియదు. ఈ విషయంలో రికార్డ్ సృష్టిస్తుంది కాంగ్రెస్.

మొన్నటికి మొన్న పుల్వామా సంఘటన మీద.. ముంబై అల్లర్ల మీద.. చెత్త వాగుడు వాగేసి ప్రజల్లో భ్రష్టుపట్టారు. అది వివాదం అయ్యిందని అనుకుంటే.. ఇప్పుడు కొత్త వివాదాలు అలుముకున్నాయి.

రాహుల్ గాంధీ ఇటీవల పరీక్షల నిర్వహణపై దారుణ వ్యాఖ్యలు చేశారు. ‘‘పరీక్ష పేపర్లు సెట్ చేసే వాళ్లు ఉన్నత కులాల వారైతే వేరే రకంగా ఉంటుంది.. దళితులు సెట్ చేస్తే మరో రకంగా ఉంటుంది.. ఓబీసీలు సెట్ చేస్తే ఇంకో రకంగా ఉంటుంది.. ’ అంటూ వివాదానికి తెరతీశారు.

ప్రతి మనిషిలో అతడు ఏం కులం అని చూసి మాట్లాడుతున్న రాహుల్ గాంధీ తీరు తీవ్ర వివాదాస్పదం అవుతుంది.

ఒక నాయకుడు పరీక్ష పేపర్లపై కుల వ్యాఖ్యలు చేస్తే మరో నాయకుడు జాతుల పేరుతో వ్యాఖ్యలు చేస్తాడు. కాంగ్రెస్ నేతల విద్వేష వ్యాఖ్యలపై ‘రామ్’  గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.