Virat Kohli – Anushka Sharma : ఇండియా ఇంగ్లాండ్ తో ఆడుతున్న ఐదు టెస్ట్ మ్యాచ్ ల్లో భాగంగా మొదటి రెండు టెస్ట్ మ్యాచ్ లకు విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. తన వ్యక్తిగత కారణాలవల్ల మ్యాచ్ లు ఆడడం లేదు అంటూ తనకు తానుగా తప్పుకున్నాడు. అయితే కారణం ఏంటి అనేది ఎవరికీ తెలియదు. కానీ రీసెంట్ గా సౌతాఫ్రికా మాజీ క్రికెట్ ప్లేయర్ అయిన ఏబి డివిలియర్స్, విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ ఒక అసక్తి కరమైన విషయాన్ని తెలియజేశాడు. కోహ్లీ మొదటి రెండు టెస్ట్ మ్యాచ్ లకు దూరమవ్వడానికి గల కారణం ఏంటి అంటే ‘కోహ్లీ అనుష్క’ దంపతులు తొందరలోనే మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇక అందుకే ఫ్యామిలీ తో టైం స్పెండ్ చేయడానికి కోహ్లీ ఆ మ్యాచ్ లకు దూరమయ్యాడు అంటూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని యూట్యూబ్ షోలో తెలియజేశాడు.
ఇక డివిలియర్స్ విరాట్ కోహ్లీ బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం మనకు తెలిసిందే. వీరిద్దరూ ఆర్సిబి టీమ్ తరఫున చాలా సంవత్సరాల పాటు కలిసి ఆడారు. ఇక ఇంత మంచి విషయాన్ని డివిలియర్స్ చెప్పడం తో అటు కోహ్లీ అభిమానులు, ఇటు డివిలియర్స్ అభిమానులు ఇద్దరు కూడా ఆనందాన్ని దాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక కోహ్లీ తన పర్సనల్ విషయాలను కూదా డివిలియర్స్ తో షేర్ చేసుకుంటున్నాడు అంటే కోహ్లీకి డివిలియర్స్ కి మధ్య ఎంత మంచి బాండింగ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
ఇక ఇది ఇలా మూడవ టెస్ట్ మ్యాచ్ నుంచి కోహ్లీ అందుబాటులోకి వస్తాడు. ఇక ప్రస్తుతం ఉన్న సిచువేషన్ లో ఇండియన్ టీం కి విరాట్ కోహ్లీ అవసరం అయితే ఉంది. ఆయన టీమ్ లో లేకపోవడం వల్లే మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఇండియా ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది. అదే కోహ్లీ ఉంటే మాత్రం ఆ మ్యాచ్ ని ఈజీగా గెలిపించేవాడు. రన్ చేజ్ చేయడం లో కోహ్లీని మించిన ప్లేయర్ మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. కాబట్టి ఆ మ్యాచ్ ను కోహ్లీ ఈజీగా విజయతీరాలకు చేర్చి ఇండియాకి ఒక అరుదైన విక్టరీ ని సాధించి పెట్టేవాడు.
కాబట్టి తను మూడో మ్యాచ్ నుంచి అందుబాటులోకి వస్తే ఇక అప్పటి నుంచైనా ఇండియా తన సత్తాను చూపిస్తుంది అంటూ మరికొందరు మాజీ ప్లేయర్లు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…
AB De Villiers said, "Virat Kohli and Anushka Sharma are expecting their 2nd child, so Virat is spending time with his family". (AB YT). pic.twitter.com/qurRKnFK1q
— Virat Kohli Fan Club (@Trend_VKohli) February 3, 2024