Virat-Anushka : మరోసారి తండ్రైన విరాట్ కోహ్లీ

తన కుమారుడికి అకాయ్ అనే పేరు పెట్టినట్టు విరాట్ ప్రకటించాడు. అప్పట్లో విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా పర్యటనకు దూరంగా ఉన్నప్పుడు ఆ జట్టు స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్.. కీలక వ్యాఖ్యలు చేశాడు.

Written By: NARESH, Updated On : February 20, 2024 9:34 pm
Follow us on

Virat-Anushka : టీం ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మరోసారి తండ్రి అయ్యాడు. ఆయన సతీమణి, ప్రముఖ నటి అనుష్క మంగళవారం రాత్రి ముంబైలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. తన కుమారుడికి ” అకాయ్” అని నామకరణం కూడా చేశారు. తనకు కుమారుడు పుట్టిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని తమ వ్యక్తిగత గోప్యతకు సహకరించాలని ఆయన అభిమానులను కోరారు. తన కుమారుడికి అకాయ్ అని పేరు పెట్టడాన్ని సంతోషిస్తున్నట్టు విరాట్ కోహ్లీ ప్రకటించాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఉద్వేగంగా ఓ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం అది తెగ చక్కర్లు కొడుతోంది.

“ఫిబ్రవరి 15న మా అమ్మాయి వామికా తమ్ముడు అకాయ్ ఈ ప్రపంచంలోకి వచ్చాడు. ఆ విషయాన్ని మీకు చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం. మా జీవితంలో అత్యంత ఆనందకరమైన సందర్భం ఇది.మీ నుంచి శుభాకాంక్షలు , దీవెనలు కోరుకుంటున్నాం. ఈ సమయంలో మీరు మా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించరని భావిస్తున్నాం. ప్రేమతో విరాట్, అనుష్క” అంటూ విరాట్ రాసకొచ్చాడు. ప్రస్తుత సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

తన భార్య అనుష్క గర్భవతిగా ఉందని విరాట్ కోహ్లీ డిసెంబర్లోనే పరోక్షంగా చెప్పాడు. వరల్డ్ కప్ ముందు కూడా జట్టు మేనేజ్మెంట్ అనుమతితో అకస్మాత్తుగా ముంబై వెళ్ళాడు. అక్కడ తన భార్యకు సంబంధించిన వైద్య పరీక్షలు చేయించాడు. అప్పట్లోనే అనుష్క శర్మ గర్భవతని అతడు పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు. ఇక కోహ్లీ ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనకు దూరంగా ఉన్నాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న సిరీస్ కు కూడా గైర్హాజరయ్యాడు. ఫిబ్రవరి 15న తనకు కుమారుడు పుట్టడంతో ఆ ఆనందాన్ని విరాట్ ఆస్వాదిస్తున్నాడు. ఇప్పటికే విరాట్, అనుష్క దంపతులకు వామిక అనే కూతురు ఉంది.

తన కుమారుడికి అకాయ్ అనే పేరు పెట్టినట్టు విరాట్ ప్రకటించాడు. అప్పట్లో విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా పర్యటనకు దూరంగా ఉన్నప్పుడు ఆ జట్టు స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్.. కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ రెండోసారి తండ్రి కాబోతున్నందునే అతడు సిరీస్ కు దూరంగా ఉన్నాడని నర్మగర్భంగా వ్యాఖ్యానించాడు..