DMK Govt Scams : అవినీతి కంపు కొడుతున్న తమిళనాడు రాజకీయాలు.. సిద్ధాంత ముసుగులో అవినీతిని పెంచి పోషిస్తోంది డీఎంకే ప్రభుత్వం. ద్రవిడవాదం పేరుతోటి దోచుకుంటోంది. తమిళనాడు రాజకీయాలు మొత్తం డబ్బు చుట్టూనే తిరుగుతోంది.
డీఎంకే ప్రభుత్వంపై ఆరోపణలతో మంత్రి వర్గంలో మార్పులు చేశారు. ఆర్థిక మంత్రి త్యాగరాజన్ ను ఆర్థిక మంత్రిగా తప్పించి ఐటీశాఖ మంత్రిగా చేశారు. ఎందుకు చేశారని ఆరాతీస్తే.. ఆయన మీద ఆడియో టేపులు బయటపడ్డాయి. త్యాగరాజన్, ఆయన అల్లుడు వందల కోట్లు ఎలాగైతే అవినీతికి పాల్పడ్డారో పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చాడు. అతడిని తొలగించని సీఎం స్టాలిన్.. కేవలం శాఖ మంత్రి ఐటీశాఖ మంత్రి పదవి ఇవ్వడంపై ప్రజలు, ప్రతిపక్షాలు ముక్కున వేలేసుకున్నాయి.
దాంతో తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ఎవరిపైనేతే అవినీతి ఆరోపణలు చేశాడో టీఆర్ బాలు యొక్క కుమారుడు టీఆర్ బీ రాజాకు పరిశ్రమల శాఖ మంత్రి పదవిని ఇచ్చి స్టాలిన్ అందరికీ షాకిచ్చాడు.
ఇలా అవినీతి కంపు కొడుతున్న డీఎంకే మంత్రివర్గంపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింద వీడియోలో చూడొచ్చు.