Ram Charan Party : దీపావళి పార్టీ ఇచ్చిన రాంచరణ్.. వెంకటేశ్, మహేష్, ఎన్టీఆర్ హాజరు.. ఫొటోలు వైరల్

నలుగురు అగ్రహీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో వైరల్ అయ్యింది. ఫ్యాన్స్ ఇది చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Written By: NARESH, Updated On : November 12, 2023 2:37 pm
Follow us on

Ram Charan Party : దీపావళిని మన తారలు కూడా ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం దేశవ్యాప్తంగా ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. మెగా పవర్ స్టార్ రాంచరణ్ – ఉపాసన దంపతులు తాజాగా ఈ దీపావళి గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి హైదరాబాద్ లోని తమ నివాసంలో ఈ వేడుకలు నిర్వహించారు.

తమ కూతురు క్లీంకారకు ఇది తొలి దీపావళి పండుగ కావడంతో రాంచరణ్ దంపతులు ఈ గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఈ దీపావళి వేడుకలకు స్టార్ హీరోలు వెంకటేశ్, మహేష్ బాబు-నమ్రత, ఎన్టీఆర్ ప్రణతి దంపతులతోపాటు మంచు లక్ష్మీ, సుధీర్ బాబు ఫ్యామిలీ, సహా టాలీవుడ్ నటీనటులు, దర్శక నిర్మాతలు ఈ పార్టీలో సందడి చేశారు. విందు భోజనం, గేమ్స్ తో అందరూ సరదాగా గడిపారు.

ఈ పార్టీకి సంబంధించిన కొన్ని ఫొటోలను నమ్రత తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నలుగురు అగ్రహీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో వైరల్ అయ్యింది. ఫ్యాన్స్ ఇది చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు.