Vasundhara Raje Vs Diya Kumari : వసుంధర రాజే vs దియాకుమారి చుట్టూ రాజస్థాన్ బీజేపీ రాజకీయాలు

వసుంధర రాజే Vs దియాకుమారి చుట్టూ రాజస్థాన్ బీజేపీ రాజకీయాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : October 18, 2023 4:33 pm

Vasundhara Raje Vs Diya Kumari : రాజస్థాన్.. ఈ ప్రాంతం అంటేనే రాజులు ఉన్న స్థానమే రాజస్థాన్.. రాజులు, కోటలు, రాజుల చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఇప్పటికీ అక్కడ కట్టడాలు ఉన్నాయి. వీళ్లు స్వాతంత్ర్యం వచ్చాక రాజకీయాల్లోకి వచ్చారు. అన్ని పార్టీల్లో ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీలు రెండింట్లోనూ ఉన్నారు.

బీజేపీ నుంచి రాజస్థాన్ సీఎంగా రెండు సార్లు ఎన్నికైన వసుంధర రాజే ఈ రాచరిక రాజ్య వంశానికి చెందిన వారే. ఇక సీఎంగా చేసిన భైరాన్ షేకావత్ కూడా రెండు సార్లు రాజస్థాన్ సీఎంగా చేశారు. ఇలా చాలా మంది ఉన్నారు.

ఇవ్వాళ రాజస్థాన్ లో బీజేపీ గెలవబోతోందన్నది ఒపినీయన్ పోల్స్ అన్నీ చెబుతున్నాయి. రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకత వల్ల బీజేపీ గెలుస్తుందని చెబుతున్నారు. అయితే ఆశ్చర్యకరంగా ఈసారి రాజస్థాన్ లో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని బీజేపీ ప్రకటించలేదు. ఇప్పటివరకూ రెండు సార్లు సీఎంగా చేసిన వసుంధరను బీజేపీ పక్కన పెట్టింది. ఇప్పటికే బీజేపీ అధిష్టానంతో, అమిత్ షాతో వసుంధరా రాజేకు గొడవలు ఉన్నాయి.

ఇప్పుడు రాజస్థాన్ లో ఏడుగురు బీజేపీ ఎంపీలను రాజస్థాన్ లో బీజేపీ దించింది. కొత్తగా బీజేపీ తరుఫున జైపూర్ మహారాణి దియా కుమారిని రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. విద్యావేత్త, ఎంపీగా ఉన్నారు. బ్రిటీష్ హయాంలో చివరి రాజు రాజా మాన్ సింగ్ మనవరాలు దియా కుమారి.

వసుంధర రాజే Vs దియాకుమారి చుట్టూ రాజస్థాన్ బీజేపీ రాజకీయాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.