PM Modi : కొత్త సంవత్సరం మోడీ దక్షిణ భారత యాత్రతో మొదలు

మోడీ రాక సందర్భంగా బీజేపీ శ్రేణులంతా నిన్న తిరుచారపల్లిని శుభ్రం చేశారు. డీఎంకే ప్రభుత్వం చేయలేని పనిని అన్నామలై బీజేపీ శ్రేణులతో చేయించారు. ఇది బీజేపీకి ప్రజల్లోనూ మంచి పేరు తీసుకొచ్చింది.

Written By: NARESH, Updated On : January 3, 2024 1:27 pm

PM Modi : కొత్త సంవత్సరం ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఒకవైపు అధికార కార్యక్రమాలకు తోడు ప్రచారంలోనూ దూసుకెళుతున్నారు. నిన్న జరిగిన దక్షిణ భారత యాత్ర మాత్రం ఎన్నికల ప్రచారంలో భాగమే..

ఓ వైపు మోడీ ప్రతీచోటకు వెళ్లి వచ్చే ఎన్నికల నేపథ్యంలో ప్రచారం చేస్తుంటే.. ఇండియా కూటమి ఇంకా సమావేశాలు, సీట్లు, పొత్తుల లెక్కలే తేలడం లేదు. ఇండియా కూటమిలో ఎవరు ఉంటారో, ఉండరో తెలియడం లేదు..

నిన్నటికి నిన్న మోడీ తమిళనాడులో ‘తిరుచారాపల్లి’ విమానాశ్రయాన్ని ప్రారంభించాడు. యూనివర్సిటీలో మాట్లాడారు. న్యూక్లియర్ ప్లాంట్ ఓపెనింగ్ కు హాజరయ్యారు. తిరుచారపల్లిలో మోడీ అంటూ జనం హోరెత్తించారు. తమిళనాడులో ఇంతటి క్రేజ్ చూస్తుంటే.. బీజేపీ నేతలు ఆశ్చర్యపోయారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అన్నామలై ఎప్పుడైతే నియామకం అయ్యాడో అప్పటి నుంచే తమిళనాడులో బీజేపీకి విశేష ప్రాచుర్యం వస్తోంది. మునుపెన్నడూ లేనంత క్రేజ్ వచ్చేసింది.

మోడీ రాక సందర్భంగా బీజేపీ శ్రేణులంతా నిన్న తిరుచారపల్లిని శుభ్రం చేశారు. డీఎంకే ప్రభుత్వం చేయలేని పనిని అన్నామలై బీజేపీ శ్రేణులతో చేయించారు. ఇది బీజేపీకి ప్రజల్లోనూ మంచి పేరు తీసుకొచ్చింది.

కొత్త సంవత్సరం మోడీ దక్షిణ భారత యాత్రతో మొదలుపెట్టిన ఈ ప్రచార పర్వంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.