Ayodhya Ram Mandir : అయోధ్య రామాలయంపై మోడీ వైపే జనం, ఒంటరైన ప్రతిపక్షాలు

అయోధ్య రామాలయంపై మోడీ వైపే జనం, ఒంటరైన ప్రతిపక్షాలు.. అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : January 23, 2024 5:43 pm

Ayodhya Ram Mandir : 500 ఏళ్ల నిరీక్షణకు నిన్న తెరపడింది. బాల రాముడు తిరిగి యథాస్థానానికి వచ్చాడు.అయోధ్య రామాలయం.. మరపు రాని సువర్ణాధ్యాయం.. దురదృష్టవశాత్తూ.. ఈ మహాత్తర ఘట్టాన్ని చూసేందుకు ప్రతిపక్షాలు రాలేదు. రాజకీయ పక్షాలు రాకపోయినా సాధువులు అంతా తరలివచ్చారు. ఎందుకంటే భారత్ ఆధ్యాత్మికతమైనది.. నిన్న మరోసారి అది మరోసారి కనపడింది.

ఒక విధంగా ప్రతిపక్షాలు బాయ్ కాట్ చేయడం రాజకీయ పిక్చర్ కంటే కూడా సామాజిక వైవిధాన్యి ప్రతిబింబించింది. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, క్రీడాకారులు, సామాన్యులు, మహిళలు, సమాజాన్ని ప్రతిబింబించింది నిన్నటి అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ట.

రెండో వైపు దురదృష్ట సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా తమిళనాట ద్రవిడ పార్టీ తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. కంచిలో ఏర్పాటు చేసిన అయోధ్య లైవ్ ను ఆపించేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరైనా దీన్ని ఆపించేసిన డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి.

అయోధ్య రామాలయంపై మోడీ వైపే జనం, ఒంటరైన ప్రతిపక్షాలు.. అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.