Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మనసున్న మారాజు, తెలుగుదేశంతో జర జాగ్రత్త

ఇక తెలుగుదేశం పార్టీ, వారి సోషల్ మీడియాకు బీజేపీతో కలిసి వెళ్లడం ఏమాత్రం ఇష్టం లేదు. పవన్ కళ్యాణ్ మనసున్న మారాజుగా ఉన్నారు.

Written By: Neelambaram, Updated On : October 6, 2023 3:43 pm

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ 4వ వారాహి యాత్ర బాగా జరిగింది. అనుకున్న దానికంటే బాగా విజయవంతమైంది. ఈ యాత్రలో జనసేనతోపాటు తెలుగుదేశం జెండాలు రెపరెపలాడాయి. ఇదొక గుణాత్మకమైన మార్పుగా చెప్పొచ్చు. ముందుముందు ఉమ్మడి కార్యాచరణకు కూడా నాంది పలకడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే పద్ధతిలో ముందుకెళితే జగన్ కు భయం కలుగడం ఖాయం. ఈసారి ఎన్నికల్లో మంచి పోటీ ఉంటుంది.. జనమంతా పవన్ కు జేజేలు పలుకుతారు.

తెలుగుదేశం లాబీ, సోషల్ మీడియా ఈరోజుకు కూడా పవన్ ను ఓన్ చేసుకున్నట్టు అనిపించడం లేదు. టైం పడుతుంది కావచ్చనిపిస్తోంది. పవన్ యాత్రలకు వారు అంత హైప్ ఇవ్వడం లేదు. కొన్ని కొన్ని యాస్పెక్ట్స్ దృష్టిలో పెట్టుకోవాలి. పవన్ ఎలాగైనా సరే ఈ పొత్తులో బీజేపీని కలుపుకొని పోవాలని.. టీడీపీ, జనసేన పొత్తులో బీజేపీ రావాలని బలంగా కోరుతున్నారు.

ఇక తెలుగుదేశం పార్టీ, వారి సోషల్ మీడియాకు బీజేపీతో కలిసి వెళ్లడం ఏమాత్రం ఇష్టం లేదు. పవన్ కళ్యాణ్ మనసున్న మారాజుగా ఉన్నారు. కానీ తెలుగుదేశంతో జర జాగ్రత్తగా ఉండాలి. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.