Bigg Boss 7 Telugu: అప్పుడు రతికతో.. ఇప్పుడు అశ్వినితో.. పల్లవి ప్రశాంత్ పని పులిహోర కలపడమేనా?

రతికా హౌజ్ లో ఉన్నంత సేపు ఆమె వెనక తిరుగుతూ ఆడియన్స్ ను నిరాశపరిచాడు. మొదటి రోజు నుంచి రతికా అందానికి ఫిదా అయిన ప్రశాంత్. ఆమె వెనక తిరుగుతూ.. ఆమె తో పులిహోర కలుపుతూ.. ప్రేక్షకులకు కాస్త చిరాకు తెప్పించాడు.

Written By: Suresh, Updated On : October 11, 2023 11:31 am

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 మొదలై ఇప్పటికే 5వారాలు గడిచాయి. ఇందులో నుంచి ఐదుగురు ఎలిమనేటై సొంతింటి దారి పడితే.. మరో ఐదుగురు బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ లో పల్లవి ప్రశాంత్ క్యారెక్టర్ మాత్రం భలే ఉంది. క్యారెక్టర్ ఏంటి అదేమైన సినిమానా అనుకుంటున్నారా? మరి సినిమాలో మాదిరి లవ్ లు నడిపిస్తుంటే ఎవరైనా ఎవరైనా ఇదే అనుకుంటారని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. రైతు బిడ్డగా సింపతీతో ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. పల్లెటూరు నుంచి వచ్చాడు అందరిని అలరిస్తాడు, పంటల గురించి మాట్లాడుతాడు, లేదా ఇంకేదైనా పల్లెటూరు వాతావరణం కనిపించేలా చేస్తారు అనుకుంటే అమ్మాయిల వెంట తిరుగుతున్నాడనే టాక్ మూట గట్టుకున్నాడు.

రతికా హౌజ్ లో ఉన్నంత సేపు ఆమె వెనక తిరుగుతూ ఆడియన్స్ ను నిరాశపరిచాడు. మొదటి రోజు నుంచి రతికా అందానికి ఫిదా అయిన ప్రశాంత్. ఆమె వెనక తిరుగుతూ.. ఆమె తో పులిహోర కలుపుతూ.. ప్రేక్షకులకు కాస్త చిరాకు తెప్పించాడు. ఆమె ఏమైనా తక్కువనా… మనోడిని తిప్పుకున్నని రోజులు తిప్పుకొని ఆతర్వాత దూరం పెట్టేసింది. నామినేషన్స్ వచ్చినప్పుడు ప్రశాంత్ ని తిట్టిని తిట్టు తిట్టకుండా తిడుతూ భలే ఝలక్ ఇచ్చింది రతికా. కేవలం ప్రశాంత్ వల్లే తన గేమ్ మొత్తం చెత్తగా అయిపోయిందని మాట్లాడింది. ఇక మనోడు చేసేది ఏం లేక వెనక తిరిగి తిరిగి అక్కా అనేశాడు.

అక్కడితో ప్రశాంత్ ఆగిపోకుండా తన బుద్ది చూపిస్తున్నాడు. రతిక ఎలిమినేటై వెళ్లిపోవడంతో హమ్మయ్య దరిద్రం పోయిందని ప్రశాంత్ అభిమానులు తెగ సంబుర పడితే.. ఫ్యాన్స్ కు మళ్లీ టెన్షన్ పెట్టే పనిలో పడ్డాడు. రతిక అయినా రాధ అయినా గీత అయినా అందంగా కనిపిస్తే ఆమెతో పులిహోర కలిపేస్తా అనే విధంగా ఆయన బిహేవియర్ ఉందంటూ కొందరి నుంచి కామెంట్స్ వస్తున్నాయి. ఆదివారం ఎపిసోడ్ లో కొత్త కంటెస్టెంట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో హాట్ హాట్ అందాలతో యువతను ఆకట్టుకున్న అశ్విని కూడా ఒకరు. ఈ అమ్మడుతోనే పులిహోర కలపడం మొదలుపెట్టాడు ప్రశాంత్.

నామినేషన్స్ సమయంలో శోభా శెట్టి అశ్విని మధ్య వాదనలు జరిగిన విషయం తెలిసిందే. దాంతో శోభా అరిచి గోల చేయడంతో అశ్విని బిత్తరపోయింది. దెబ్బకు ఏడుపు అందుకుంది. ప్రశాంత్ కెప్టెన్ కాబట్టి వెళ్లి ఆమెను ఓదారుస్తూ బాగానే పులిహోర కలిపేశాడు. ఇంట్లో ఉన్నవాళ్లందరూ ఆమెను అలాగే వదిలేస్తే.. ఈ రైతు బిడ్డ మాత్రం ఆమె దగ్గర కూర్చుని ఏడవకూడదు. ఏం కాదు అంటూ కబుర్లు చెప్తూ కనిపించాడు. ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లడం మొదలుపెట్టాడు. ఎప్పుడు చూసినా ఆమె పక్కనే ఉంటూ కనిపిస్తున్నాడు. దీంతో నెటిజన్ల నుంచి పులిహోర రాజా అనే పేరు సంపాదిస్తాడేమో అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.