Mahua Moitra : మహువా మొయిత్రా కుంభకోణం: మరో 8 మంది పార్లమెంటు సభ్యులు చిక్కుల్లో

మహువా మొయిత్రా కుంభకోణం: చిక్కుల్లో మరో 8 మంది పార్లమెంటు సభ్యులపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : October 20, 2023 5:02 pm

Mahua Moitra : మహువా మొయిత్రా అనంగానే మోడీ వ్యతిరేకులతో ఆవిడను ఒక ఐకానిక్ గా భావిస్తారు. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడించాలంటే మహువానే టీవీ చానెల్స్ తీసుకొస్తారు. ఇవ్వాల తనతోపాటు సహజీవనం చేసిన జై అనంత్ తాజాగా సీబీఐకి కంప్లైంట్ ఇచ్చారు. మహువా డబ్బులు తీసుకొని దేశంలోని పారిశ్రామికవేత్తల తరుఫున ప్రశ్నలు సంధిస్తోందని ఆరోపణలు వచ్చాయి. తాజాగా మహువా సహజీవనం చేసిన వ్యక్తి అప్రూవర్ గా మారారు. సీబీఐకి ఫిర్యాదు చేసి అప్రూవర్ గా మారారు.

బెంగాల్ బిజినెస్ గ్లోబర్ సమ్మిట్ 2017లో జరిగింది. ఆ సమ్మిట్ లో మహువా ఇతడికి పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా వ్యక్తిగత సంబంధానికి దారితీసింది. 2019లో ఆమె ఎంపీగా ఎన్నికైన తర్వాత ఆ రిలేషన్ షిప్ బలపడింది. మహువాకు కీర్తి ప్రతిష్టల మీద పిచ్చి. ఐకానిక్ గా మారాలని.. మోడీని గట్టిగా తిట్టడమే తనకు పేరు వస్తుందని ఆమె భావించింది. మోడీతోపాటు గౌతం అదానీపై అటాక్ చేస్తే మోడీ వ్యతిరేకులకు టార్గెట్ అవుతానని భావించింది.

మహువా మొయిత్రా కుంభకోణం: చిక్కుల్లో మరో 8 మంది పార్లమెంటు సభ్యులపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.