Voice Of The Nation : లోక్సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మొత్తం 543 లోక్సభ స్థానాలకు గాను 362 స్థానాల్లో భారీ మెజారిటీతో విజయం సాధించగలదని ఇండియా టీవీ-మ్యాట్రిజ్ న్యూస్ కమ్యూనికేషన్ దేశవ్యాప్తంగా నిర్వహించిన అభిప్రాయ సేకరణలో పేర్కొంది. ‘దేశ్ కీ ఆవాజ్’ (వాయిస్ ఆఫ్ ది నేషన్) పేరుతో జరిపిన సర్వే ఫలితాలు ఈరోజు (శుక్రవారం జూలై 29) సాయంత్రం విడుదల చేశారు.

సర్వే ప్రకారం కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (UPA) ఇప్పటికిప్పుడు సాధారణ ఎన్నికలు జరిగితే 97 లోక్ సభ సీట్లు మాత్రమే గెలుస్తుందని అంచనా వేయబడింది. చిన్న, ప్రాంతీయ పార్టీలు మరియు స్వతంత్రులతో సహా ‘ఇతరులు’ 84 సీట్లు గెలుచుకుంటారని అంచనా వేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 41 శాతం, యూపీఏకు 28 శాతం, ఇతరులకు 31 శాతం ఓట్లు రావచ్చని సర్వే అంచనా వేసింది.
-రాష్ట్రాల వారీగా సర్వేలో వెల్లడించిన వివరాలు ఆసక్తికరంగా మారాయి.
అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్లో, 80 లోక్ సభ సీట్లలో NDA అత్యధికంగా 76 గెలుచుకోవచ్చు, UPA మరియు ఇతరులు ఒక్కొక్కటి రెండు సీట్లు మాత్రమే గెలుస్తారని అంచనా. బీహార్లో మొత్తం 40 సీట్లలో ఎన్డిఎ 35, యుపిఎ ఐదు సీట్లు గెలుచుకోవచ్చు.
మహారాష్ట్రలో మొత్తం 48 లోక్సభ స్థానాలకు గాను ఎన్డీఏ 37 సీట్లు గెలుచుకోగా, బీజేపీయేతర ప్రతిపక్షాలు మిగిలిన 11 స్థానాలను గెలుచుకోవచ్చు.
తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకె నేతృత్వంలోని యుపిఎ మొత్తం 39 స్థానాలకు గాను 38 స్థానాలు గెలుచుకుంటుందని, మిగిలిన ఒక్క సీటును ఎన్డిఎకు వదిలివేస్తుందని అంచనా.
-ఎల్డిఎఫ్ అధికారంలో ఉన్న కేరళలో బిజెపియేతర ప్రతిపక్షం రాష్ట్రంలోని 20 లోక్సభ స్థానాలను కైవసం చేసుకోగలదు.
తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్లో, మమతా బెనర్జీ యొక్క తృణమూల్ కాంగ్రెస్ మొత్తం 42 సీట్లలో 26, NDA 14 మరియు UPA రెండు గెలుస్తుందని అంచనా వేసింది.
* సర్వే ఏజెన్సీ రాష్ట్రాల వారీగా ఎంపీ సీట్లను ఇలా లెక్కగట్టింది..
గుజరాత్: మొత్తం సీట్లు (26): NDA 26, UPA 0.
మహారాష్ట్ర: మొత్తం 48 సీట్లలో NDA 37, UPA 11.
గోవా: మొత్తం 2 సీట్లలో NDA 2.
రాజస్థాన్ : మొత్తం 25 సీట్లలో NDA 25.
మధ్యప్రదేశ్: మొత్తం 29 సీట్లలో NDA 28, UPA 1.
ఛత్తీస్గఢ్: మొత్తం 11 సీట్లలో NDA 10, UPA 1.
పశ్చిమ బెంగాల్: మొత్తం 42 సీట్లలో NDA 14, UPA 2, ఇతరులు (TMC) 26.
బీహార్: మొత్తం 40 సీట్లలో NDA 35, UPA 5.
జార్ఖండ్: మొత్తం 14 సీట్లలో NDA 13, UPA 1.
ఒడిశా: మొత్తం 21 సీట్లలో NDA 11, UPA 2, ఇతరులు (BJDతో సహా) 8.
హిమాచల్ ప్రదేశ్: మొత్తం 4 సీట్లలో NDA 4.
పంజాబ్: మొత్తం 13 సీట్లలో NDA 3, UPA 3, ఇతరులు (AAPతో సహా) 7.
హర్యానా: మొత్తం 10 సీట్లలో NDA 9, UPA 1.
జమ్మూ & కాశ్మీర్, లద్దాఖ్: మొత్తం 6 సీట్లలో NDA 3, UPA 0, ఇతరులు 3.
ఢిల్లీ: మొత్తం 7 సీట్లలో NDA 7, UPA 0, ఇతరులు 0.
ఉత్తరాఖండ్: మొత్తం 5 సీట్లలో NDA 5, UPA 0.
తెలంగాణ: మొత్తం 17 సీట్లలో ఎన్డీఏ 6, యూపీఏ 2, ఇతరులు (టీఆర్ఎస్తో సహా) 9.
ఆంధ్రప్రదేశ్: మొత్తం 25 సీట్లలో NDA 0, UPA 0, ఇతరులు (వైఎస్ఆర్కాంగ్రెస్తో సహా) 25.
కర్ణాటక: మొత్తం 28 సీట్లలో NDA 23, UPA 4 ఇతరులు 1.
తమిళనాడు: మొత్తం 39 సీట్లలో ఎన్డిఎ 1, యుపిఎ (డిఎంకెతో సహా) 38, ఇతరులు 0.
కేరళ: మొత్తం 20 సీట్లలో NDA 0, UPA 20, ఇతరులు 0.
త్రిపుర: మొత్తం 2 సీట్లలో NDA 2, UPA 0.
అస్సాం: మొత్తం 14 సీట్లలో NDA 11, UPA 1, ఇతరులు 2.
ఈశాన్య రాష్ట్రాలు: మొత్తం 9 సీట్లలో NDA 7, UPA 1, ఇతరులు 1.
మిగిలిన యూటీలు: మొత్తం 6 సీట్లలో NDA 4, UPA 2, ఇతరులు 0.
ప్రధానమంత్రిగా తమ మొదటి ఎంపిక గురించి అడిగిన ప్రశ్నకు.. 48 శాతం మంది నరేంద్ర మోదీని మళ్లీ ప్రధానిగా చూడాలనుకుంటున్నట్లు చెప్పారు. మోదీ తర్వాతి స్థానాల్లో రాహుల్ గాంధీ 11 శాతం, మమతా బెనర్జీ 8 శాతం, సోనియా గాంధీ 7 శాతం, మాయావతి 6 శాతం, శరద్ పవార్ 6 శాతం, అరవింద్ కేజ్రీవాల్ 5 శాతం, నితీష్ కుమార్ 4 శాతం, కె చంద్రశేఖర్ రావు 3 శాతం ఉన్నారు. ప్రియాంక వాద్రా 2 శాతంతో ఉన్నారు.
మోదీకి బలమైన రాజకీయ ప్రత్యర్థి ఎవరన్న ప్రశ్నకు 23 శాతం మంది రాహుల్ గాంధీ వైపు మొగ్గు చూపగా, 19 శాతం మంది అరవింద్ కేజ్రీవాల్ను ఎంచుకున్నారు. 11 శాతం మంది మమతా బెనర్జీకి మొగ్గు చూపగా, 8 శాతం మంది నితీష్ కుమార్, సోనియా గాంధీల వైపు మొగ్గు చూపారు.
ఇండియా టీవీ-మ్యాట్రిజ్ ఒపీనియన్ పోల్ ‘దేశ్ కి ఆవాజ్’ జూలై 11 నుండి 24 వరకు భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో 136 ఎంపీ సీట్ల పరిధిలో 34,000 మంది క్రియాశీల ప్రజల నమూనాలు సేకరించారు. వీరిలో 19,830 మంది పురుషులు, 14,170 మంది మహిళలు ఉన్నారు.