Bigg Boss 7 Telugu : ఇదేం ఉల్టా ఫుల్టా బాబోయ్… అతను విన్నర్.. ప్రైజ్ మనీ మాత్రం ఆ ఇద్దరికీ!

ఒకవేళ ఓటింగ్ పెరిగి రెండో స్థానంలో ఉన్న శివాజీయే కప్ కొడితే .. తనకు ఎంతగానో ఇష్టమైన ప్రశాంత్, యావర్ లకు డబ్బులు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

Written By: NARESH, Updated On : December 14, 2023 9:01 pm
Follow us on

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ సీజన్ 7 ఇప్పటికే 14 వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. 15వ వారం ఫినాలే వీక్ ఆసక్తికరంగా సాగుతుంది. కాగా డిసెంబర్ 17న షో కి ఎండ్ కార్డు పడనుంది. ఈ నేపథ్యంలో విన్నర్ ఎవరు .. రన్నర్ అప్ గా ఎవరు నిలుస్తారు అనే అంశం ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ఇక ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఒకరు బయటకు వెళ్లనున్నారు అని తెలుస్తుంది. అయితే విన్నర్ ప్రైజ్ మనీ గురించి పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి.

ఈ క్రమంలో స్పై బ్యాచ్ లోని శివాజీ, ప్రశాంత్, యావర్ .. వాళ్ళ ముగ్గురిలో ఎవరు గెలిచినా .. ప్రైజ్ మనీ ఎవరికో కన్ఫర్మ్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఉన్న ఓటింగ్ బట్టి చూస్తే ప్రశాంత్ టాప్ లో ఉన్నాడు. ఇక శివాజీ టాప్ 2 లో ఉన్నాడు. తర్వాత అమర్ దీప్ మూడవ స్థానంలో నిలిచాడు. యావర్ నాలుగో స్థానంలో ఉండగా .. ప్రియాంక టాప్ 5 పొజిషన్ లో ఉంది. ఇక అందరికంటే చివర్లో ఉన్న అర్జున్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో బయటకు వస్తున్నట్లు సమాచారం.

అయితే అందరూ కోరుకున్నట్లు ప్రశాంత్ గనుక విన్నర్ అయితే .. వచ్చిన అమౌంట్ రైతులకు ఇస్తానని ఇప్పటికే ప్రకటించేశాడు. ఒకవేళ ఓటింగ్ పెరిగి రెండో స్థానంలో ఉన్న శివాజీయే కప్ కొడితే .. తనకు ఎంతగానో ఇష్టమైన ప్రశాంత్, యావర్ లకు డబ్బులు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రశాంత్ ఎటూ రైతులకు సాయం చేయాలనుకుంటున్నాడు. ఆ పని శివాజీయే చేసి .. ఆర్థికంగా కాస్త ఇబ్బందులు పడుతున్న యావర్ కు కొంత డబ్బు ఇచ్చి సాయం చేయబోతున్నాడట.

ఒక వేళా అమర్, ప్రియాంక లో ఎవరు గెలిచినా .. తమ కోసమే ఉపయోగించుకుంటారు అని షో లో చెప్పారు. ఇప్పటికే ప్రశాంత్, శివాజీ లో ఒకరు విజేతగా నిలుస్తారని క్లారిటీ వచ్చింది. అమర్ కి కప్పు ఫై ఆశలు ఉన్నాయి. కాబట్టి ప్రియాంక, యావర్ కి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో డబ్బులు ఆఫర్ చేస్తే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.