KCR-Revanth Reddy : తెలుగు ప్రజల్ని విడదీయటం కాదు కలిసి వుండే ఆలోచనలు చేయండి

తెలుగు ప్రజల్ని విడదీయటం కాదు కలిసి వుండే ఆలోచనలు చేయండి.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..

Written By: NARESH, Updated On : February 13, 2024 12:39 pm

KCR-Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీలో రెండు మూడురోజుల నుంచి ‘తెలంగాణకు అన్యాయంపై’ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య చర్చ నడుస్తోంది. అసలు సమస్యలు పక్కకుపోయాయి. రాష్ట్రాలు విడిపోయాయి.. కనీసం ఇప్పుడైనా కలిసి ఉండాలన్న ఆశ ప్రజల్లో ఉంది. వీటిల్లో ఐక్యత ఉండాలని కోరుతున్నారు. కానీ నేతలు మాత్రం ప్రజలను రెచ్చగొడుతూ విడగొడుతున్నారు.

పారే నీరు.. ఒక రాష్ట్రానికి సంబంధించిందో అర్థం కాదు.. విదేశీ విధానం, రక్షణ, కమ్యూనికేషన్లు మాత్రమే కేంద్రం పరిధిలో ఉంచి నదీజలాలను రాష్ట్రాలకు వదిలేశారు. అదే ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. పారే నీరు ఎలా రాష్ట్రాలకు సంబంధించిందో అర్థం కాదు.. కేంద్రం చేసిన పెద్ద తప్పు ఇదే..

రాష్ట్రాలకు హక్కులు తీసేసి కేంద్రం ఒక స్వతంత్ర్య సంస్థను ఏర్పాటు చేసి నీటి పంపకాలు చేపడితే సమస్యలు రావు.

ఏపీలో విభజన చట్టంలోనే గోదావరి, కృష్ణాలపై అజమాయిషీ కేంద్రం చేతుల్లో ఉంటుందని పెట్టారు. ఇప్పుడు నీటి రాజకీయం రెండు

తెలుగు ప్రజల్ని విడదీయటం కాదు కలిసి వుండే ఆలోచనలు చేయండి.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..