Powergrid Jobs: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. అసిస్టెంట్ ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను ఈ సంస్థ విడుదల చేసింది. మొత్తం 105 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు భారీ మొత్తంలో వేతనం లభించనుందని సమాచారం అందుతోంది.
Powergrid Jobs
అసిస్టెంట్ ఇంజినీర్ ట్రయినీ ఉద్యోగ ఖాళీలలో కంప్యూటర్ సైన్స్ ఉద్యోగ ఖాళీలు 37, ఎలక్ట్రికల్ 60, సివిల్ ఇంజనీరింగ్ ఉద్యోగ ఖాళీలు 4, ఎలక్ట్రానిక్స్ ఉద్యోగ ఖాళీలు 4 ఉన్నాయి. ట్రైనింగ్ పీరియడ్ లో పవర్ గ్రిడ్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 40,000 రూపాయలు వేతనంగా లభిస్తుంది. ట్రైనింగ్ పూర్తైన తర్వాత అర్హత, అనుభవం ఆధారంగా 50,000 రూపాయల నుంచి 1,60,000 రూపాయల వరకు వేతనం లభించనుంది.
Also Read: పదో తరగతి అర్హతతో 1501 ఉద్యోగ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే?
ఫుల్ టైం బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు గేట్ స్కోర్ ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రికల్/సివిల్/ఎలక్ట్రానిక్స్ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. 2021 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ నాటికి 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు.
ఆన్ లైన్ ద్వారా అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 500 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూసీ అభ్యర్ధులు ఈ ఉద్యోగాల కోసం ఎలాంటి దరఖాస్తు ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు.
Also Read: విశాఖలో 31 ఉద్యోగ ఖాళీలు.. రూ.90 వేలకు పైగా వేతనంతో?