Twitter- IRCTC: కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై ఏర్పాటుచేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు హాజరు కావాల్సిందిగా మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ తోపాటు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సమన్లు అందాయి.
“పౌరుల డేటా భద్రత మరియు గోప్యత” ఉల్లంఘనలపై ఆందోళనలను చర్చించడానికి ట్విట్టర్ మరియు రైల్వే టికెటింగ్ యాప్ని స్టాండింగ్ కమిటీ పిలిచింది. ఈ పార్లమెంటరీ సమావేశం కేంద్ర ప్రభుత్వం వ్యక్తిగత డేటా రక్షణ (PDP) బిల్లు-2019ని ఉపసంహరించుకున్న కొద్ది రోజుల తర్వాత జరుగుతుండడం విశేషం. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ ప్యానెల్ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ నిర్వహణ మరియు కూర్పుపై ప్రశ్నిస్తుంది. భారతదేశంలోని ఏదైనా నిర్దిష్ట రాజకీయ పార్టీకి అది అనుకూలంగా ఉందా లేదా అనే దాని గురించి ట్విట్టర్ ప్రశ్నించవచ్చు.
Also Read: Team India New Jersey- Asia Cup 2022: ఆసియా కప్ కోసం కొత్త జెర్సీతో టీమిండియా.. అదిరిపోలా..
రైల్వే టికెటింగ్ యాప్కు రూ.10 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. ఇటీవల దాని ప్రయాణీకుల డేటాను మానిటైజ్ చేయడానికి ఒక కన్సల్టెంట్ను నియమించారు. పార్లమెంటరీ కమిటీ కన్సల్టెంట్ను నియమించుకోవడానికి కారణాల కోసం ఐఆర్సీటీసీని ప్రశ్నించవచ్చు. కన్సల్టెంట్ ఉద్యోగం కోసం తీసుకున్న టెండర్ గురించి కూడా ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.
నివేదిక ప్రకారం.. శశి థరూర్ నేతృత్వంలోని ప్యానెల్ డేటా భద్రత , గోప్యతకు సంబంధించి వివిధ వాటాదారులతో అనేక సమావేశాలు నిర్వహించింది. ఈ వాటాదారులు టెక్ కంపెనీలు, సోషల్ మీడియా సంస్థలు, మంత్రిత్వ శాఖలు, ఇతర నియంత్రణ సంస్థలను ప్రశ్నిస్తుంది. ఈ కమిటీ తన నివేదికను ఆగస్టు 30, 2022లోపు పార్లమెంట్ కు సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం ఉల్లంఘనలపై పార్లమెంట్ నిర్ణయం తీసుకుంటుంది.
Also Read:Chiranjeevi Mother Anjana Devi: చిరంజీవి గారి తల్లికి బాగా ఇష్టమైన హీరో ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read More