spot_img
Homeవింతలు-విశేషాలుKundanbagh Haunted House: రాత్రిళ్లు గజ్జెల చప్పుళ్లు.. ఆత్మల ఘోష.. ఇప్పటికీ మిస్టరీగా కుందన్ బాగ్...

Kundanbagh Haunted House: రాత్రిళ్లు గజ్జెల చప్పుళ్లు.. ఆత్మల ఘోష.. ఇప్పటికీ మిస్టరీగా కుందన్ బాగ్ బిల్డింగ్..

Kundanbagh Haunted House: మనం దారి వెంబడి వెళ్తుంటే కొన్ని పురాతన భవనాలు కనిపిస్తూ ఉంటాయి. వీటిని చాలామంది పట్టించుకోరు. కానీ కొన్ని మాత్రం సంవత్సరాల తరబడి అలాగే ఉండిపోతాయి. వీటిని కూల్చివేసి మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయడం గాని.. లేదా వాటి గురించి పట్టించుకోవడానికి కొందరు భయపడుతూ ఉంటారు. ఎందుకంటే పురాతన భవనం అనగానే అందులో ఏదో ఉంటుందని అనుమానం చాలామందికి ఉంటుంది. అయితే తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున కూడా ఒక పురాతన భవనం ఉంది. ఈ భవనం చుట్టుపక్కల ఉన్నవారు చెప్పేది ఏంటంటే.. రాత్రి సమయంలో ఏదో గజ్జల సౌండ్ వినిపిస్తుందని.. ఇద్దరు అమ్మాయిలు నడిచినట్లు అనిపిస్తుందని చెబుతున్నారు. ఇంతకీ ఆ బంగ్లా మిస్టరీ ఏంటి? చుట్టుపక్కల వారు చెప్పేది నిజమేనా?

హైదరాబాదులోని కుందన్ భాగ్ ఏరియా గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న ఇళ్ల గురించి అందరికీ తెలియకపోవచ్చు. ప్రస్తుతం పురాతన భవనంలో కనిపిస్తున్న ఈ భవనాన్ని 2002 లో వర్షిత్ నారాయణ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. అయితే ఈయన చుట్టుపక్కల వారితో ఎక్కువగా కమ్యూనికేషన్ ఉండే ప్రయత్నం చేయలేదు. ఎప్పుడూ లోన్లీగా కనిపించేవాడని చుట్టుపక్కల వారు చెప్పారు. అయితే అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు అమెరికాలో ఉండేవాడు. ఒకరోజు అనుకోకుండా వర్షిత్ నారాయణ మరణించాడు. దీంతో అతని కుమారుడికి ఈ విషయం తెలియగానే ఇక్కడికి వచ్చి కార్యక్రమాలు అన్ని పూర్తి చేసిన తర్వాత.. ఆ బంగ్లాను ఒక ఫ్యామిలీకి అద్దెకు ఇచ్చాడు. ఆ ఫ్యామిలీ లో భార్యాభర్తలతో పాటు ముగ్గురు అమ్మాయిలు ఉండేవారు. అయితే వీళ్ళు కూడా ఇతరులతో ఎక్కువగా కమ్యూనికేషన్ చేసేవారు కాదు.

అయితే ఒక రోజు ఈ భవనంలో దొంగతనానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి భవనంలోకి రాగానే ముగ్గురూ అమ్మాయిలా మృతదేహాలు వరుసగా పడి ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురైన ఆ వ్యక్తి వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి చెప్పాడు. పోలీసులు ముందుగా అతడిని అరెస్టు చేసి.. ఆ తర్వాత ఇంటరాగేషన్ కోసం భవనం వద్దకు వచ్చారు. అయితే ఆ భవనంలోని మృతదేహాలను చూస్తే ఆరు నెలల కింద మరణించినట్లు కనుగొన్నారు. అసలు ఏం జరిగింది అని పోలీసులు పోస్టుమార్టంకు పంపించి ఆరా తీయగా ఆ కుటుంబంలో కొన్ని కారణాలతో ఫినాయిల్ తాగి మరణించినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఆ తర్వాత మహమ్మద్ సజన్ అనే దొంగను విడిచిపెట్టారు.

అయితే ఈ భవనంలో రాత్రి సమయంలో ఇద్దరూ ఆడవాళ్లు తిరుగుతున్నట్లు.. గజ్జల సౌండ్ వస్తున్నట్లు చుట్టుపక్కల వారంతా అనుకోవడంతో.. అది కాస్త ఇంటర్నెట్ లేని కాలంలోనే వైరల్ గా మారిపోయింది. ఒకరి నుంచి మరొకరికి వెళ్లి కుందన్ బాగ్ మిస్టరీ బిల్డింగ్ అని చాలామంది స్టోరీస్ కూడా రాస్కొచ్చారు. మొత్తంగా చెప్పేది ఏందంటే ఈ భవనంలో ముగ్గురు ఆడవాళ్లు ఎందుకు చనిపోయారు అన్నది మిస్టరీగా ఉండిపోయింది. అలాగే రాత్రి సమయంలో నిజంగానే భవనం నుంచి శబ్దాలు వస్తున్నాయా? అని కొందరు ఇప్పటికీ ఆరా తీస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Kallanai Dam

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...
Godavari Pulasa

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....
Adani Group Airlines

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...
Srirastu Meaning

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Amazon Employee Quits Job

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...
Oktelugu Epaper