Homeవింతలు-విశేషాలుDoctor Bincy Fish Scale Experiment: చేప పొలుసులతో.. ఎముకలు, దంతాలు.. ఈ మహిళ చేసిన...

Doctor Bincy Fish Scale Experiment: చేప పొలుసులతో.. ఎముకలు, దంతాలు.. ఈ మహిళ చేసిన ప్రయోగం ఎలాంటిదంటే..

Doctor Bincy Fish Scale Experiment: మార్కెట్లో మనం చేపల కొంటాం. ఇంటికి తీసుకొచ్చి పొలుసులను శుభ్రం చేస్తాం. ఆ తర్వాత కడిగి పండుకుంటాం. నచ్చినట్టు చింతపులుసు పోసుకొని.. కారం ఉప్పు దండిగా వేసుకొని హాయిగా తింటాం. కానీ ఎప్పుడు కూడా చేప పొలుసుల గురించి మనం ఆలోచించం.

మనలో చాలామందికి పొలుసులంటే వ్యర్థ పదార్థమని ఒక బలమైన నమ్మకం. పైగా వాటితో కూర కూడా వండుకోవడం సాధ్యం కాదు. అందువల్లే వాటిని వృధాగా పడేస్తూ ఉంటాం. అయితే వీటి మీద ఓ మహిళ ప్రయోగాలు చేసింది. దుర్వాసన వచ్చినా సరే వెనకడుగు వేయలేదు. ఆమె ప్రయోగం ఫలించింది. చివరికి వైద్య రంగానికి కీలకమైన పదార్థాలను అందించే దిశగా ఆమె అడుగులు వేసింది. ఇది కాస్త శాస్త్ర సాంకేతిక రంగంలో సరికొత్త మార్పుగా అవతరించింది.

ఆమె పేరు డాక్టర్ బిన్సీ. హైదరాబాద్ నగరంలో ఉన్న సిఐఎఫ్టీ (Central institute of fisheries technology) విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఈమెకు మొదటి నుంచి కూడా విభిన్నమైన ప్రయోగాలు చేయడం చాలా ఇష్టం.. పైగా మనుషులను వేధిస్తున్న ఎముకల రుగ్మత.. దంతాల రుగ్మత ఆమెను నిత్యం ఆలోచనలో పడేసేవి. అందువల్ల చేప పొలుసుల మీద ప్రయోగాలు చేయడం మొదలుపెట్టింది.

పొలుసుల ద్వారా ఎముకలు, దంతాల రుగ్మతులను తగ్గించే నానో ఫైబర్ ఆధారిత గ్రాఫ్ట్ పదార్థాన్ని బిన్సి తయారుచేసింది. చేపలు, ఇతర జలచరాల వ్యర్ధాల నుంచి హైడ్రాక్సి అపటైట్, కొలాజన్ వంటి విలువైన పదార్థాలను కూడా అభివృద్ధి చేసింది. ఈ విధానాలు భారతదేశానికి ఫిషరీస్ విభాగం లో సరికొత్త ఆదాయాన్ని తెచ్చే విధంగా మారతాయని బిన్సీ చెబుతున్నారు.

చేపల పొలుసులను ఎలక్ట్రో స్పిన్నింగ్ ప్రక్రియ ద్వారా వైద్య ఆధారిత ఉత్పత్తులు తయారు చేస్తున్నారు.. ఈ విధానంలో చేప పొలుసులను ముందుగా సన్నటి ఫైబర్లుగా మార్చేస్తుంటారు. ఆ తర్వాత ఒక సీట్ మీదకి తెస్తారు. అనంతరం వాటిని నానో ఫైబర్ గ్రాఫ్ట్ పదార్థాలుగా మార్చుతారు. వీటివల్ల గాయాలు నయమవుతాయి. ముఖ్యంగా వెరీ నా ఎముకలను అతికించడానికి తోడ్పడతాయి.

రొయ్యలు, పీతలు వంటి వాటి మీద పెంకుల్లో కైటిన్ అనే పదార్థం ఉంటుంది. వాటి నుంచి బయోడిగ్రేబుల్ కైతోసాన్ అనే పదార్థాన్ని తయారుచేస్తారు. ఇది యాంటీ మైక్రోబియన్ లక్షణాలను కలిగి ఉంటుంది. అందువల్ల బయో మెడికల్.. ఫుడ్ ప్యాకేజింగ్ లో ఉపయోగించవచ్చు. అంతేకాదు మెరైన్ విభాగంలో నుంచి వచ్చే వ్యర్ధాల ద్వారా క్వాలిటీ ఉన్న కైటోసాన్ ను సిఐఎఫ్టీలో ఉత్పత్తి చేస్తున్నారు.. ఇవి మాత్రమే కాకుండా మంచానికే పరిమితమైన వయోధికుల శరీరం మీద అయినా పుండ్లను.. ఇతర గాయాలను మాన్పించడానికి ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఫిషరీస్ విభాగంలో విపరీతంగా కోలాజెన్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఇది వైద్య అవసరాలకు విపరీతంగా ఉపయోగపడుతుంది. అంతేకాదు గాయాలను మాన్పడానికి సహకరిస్తుంది. కొన్ని సందర్భాలలో చేప చర్మాన్ని ప్రాసెస్ చేసి.. సరికొత్త టెక్నాలజీతో గాయాలను మాన్పించే ఉత్పత్తులను తయారు చేసేందుకు పరిశోధనలు చేస్తున్నారు. మరోవైపు స్క్విడ్ అనే సముద్ర జీ మీద ఇటీవల ప్రయోగాలు చేశారు. దీని ఇంక్ భాగంలో అత్యధికంగా మెలనిన్ ఉంటుంది. దీన్ని ప్రాసెస్ చేసి మనుషుల్లో తలెత్తే అనేక రకాల రుగ్మతలకు మందుగా వాడేందుకు ప్రయోగాలు చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version