Homeవింతలు-విశేషాలుDoctor Bincy Fish Scale Experiment: చేప పొలుసులతో.. ఎముకలు, దంతాలు.. ఈ మహిళ చేసిన...

Doctor Bincy Fish Scale Experiment: చేప పొలుసులతో.. ఎముకలు, దంతాలు.. ఈ మహిళ చేసిన ప్రయోగం ఎలాంటిదంటే..

Doctor Bincy Fish Scale Experiment: మార్కెట్లో మనం చేపల కొంటాం. ఇంటికి తీసుకొచ్చి పొలుసులను శుభ్రం చేస్తాం. ఆ తర్వాత కడిగి పండుకుంటాం. నచ్చినట్టు చింతపులుసు పోసుకొని.. కారం ఉప్పు దండిగా వేసుకొని హాయిగా తింటాం. కానీ ఎప్పుడు కూడా చేప పొలుసుల గురించి మనం ఆలోచించం.

మనలో చాలామందికి పొలుసులంటే వ్యర్థ పదార్థమని ఒక బలమైన నమ్మకం. పైగా వాటితో కూర కూడా వండుకోవడం సాధ్యం కాదు. అందువల్లే వాటిని వృధాగా పడేస్తూ ఉంటాం. అయితే వీటి మీద ఓ మహిళ ప్రయోగాలు చేసింది. దుర్వాసన వచ్చినా సరే వెనకడుగు వేయలేదు. ఆమె ప్రయోగం ఫలించింది. చివరికి వైద్య రంగానికి కీలకమైన పదార్థాలను అందించే దిశగా ఆమె అడుగులు వేసింది. ఇది కాస్త శాస్త్ర సాంకేతిక రంగంలో సరికొత్త మార్పుగా అవతరించింది.

ఆమె పేరు డాక్టర్ బిన్సీ. హైదరాబాద్ నగరంలో ఉన్న సిఐఎఫ్టీ (Central institute of fisheries technology) విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఈమెకు మొదటి నుంచి కూడా విభిన్నమైన ప్రయోగాలు చేయడం చాలా ఇష్టం.. పైగా మనుషులను వేధిస్తున్న ఎముకల రుగ్మత.. దంతాల రుగ్మత ఆమెను నిత్యం ఆలోచనలో పడేసేవి. అందువల్ల చేప పొలుసుల మీద ప్రయోగాలు చేయడం మొదలుపెట్టింది.

పొలుసుల ద్వారా ఎముకలు, దంతాల రుగ్మతులను తగ్గించే నానో ఫైబర్ ఆధారిత గ్రాఫ్ట్ పదార్థాన్ని బిన్సి తయారుచేసింది. చేపలు, ఇతర జలచరాల వ్యర్ధాల నుంచి హైడ్రాక్సి అపటైట్, కొలాజన్ వంటి విలువైన పదార్థాలను కూడా అభివృద్ధి చేసింది. ఈ విధానాలు భారతదేశానికి ఫిషరీస్ విభాగం లో సరికొత్త ఆదాయాన్ని తెచ్చే విధంగా మారతాయని బిన్సీ చెబుతున్నారు.

చేపల పొలుసులను ఎలక్ట్రో స్పిన్నింగ్ ప్రక్రియ ద్వారా వైద్య ఆధారిత ఉత్పత్తులు తయారు చేస్తున్నారు.. ఈ విధానంలో చేప పొలుసులను ముందుగా సన్నటి ఫైబర్లుగా మార్చేస్తుంటారు. ఆ తర్వాత ఒక సీట్ మీదకి తెస్తారు. అనంతరం వాటిని నానో ఫైబర్ గ్రాఫ్ట్ పదార్థాలుగా మార్చుతారు. వీటివల్ల గాయాలు నయమవుతాయి. ముఖ్యంగా వెరీ నా ఎముకలను అతికించడానికి తోడ్పడతాయి.

రొయ్యలు, పీతలు వంటి వాటి మీద పెంకుల్లో కైటిన్ అనే పదార్థం ఉంటుంది. వాటి నుంచి బయోడిగ్రేబుల్ కైతోసాన్ అనే పదార్థాన్ని తయారుచేస్తారు. ఇది యాంటీ మైక్రోబియన్ లక్షణాలను కలిగి ఉంటుంది. అందువల్ల బయో మెడికల్.. ఫుడ్ ప్యాకేజింగ్ లో ఉపయోగించవచ్చు. అంతేకాదు మెరైన్ విభాగంలో నుంచి వచ్చే వ్యర్ధాల ద్వారా క్వాలిటీ ఉన్న కైటోసాన్ ను సిఐఎఫ్టీలో ఉత్పత్తి చేస్తున్నారు.. ఇవి మాత్రమే కాకుండా మంచానికే పరిమితమైన వయోధికుల శరీరం మీద అయినా పుండ్లను.. ఇతర గాయాలను మాన్పించడానికి ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఫిషరీస్ విభాగంలో విపరీతంగా కోలాజెన్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఇది వైద్య అవసరాలకు విపరీతంగా ఉపయోగపడుతుంది. అంతేకాదు గాయాలను మాన్పడానికి సహకరిస్తుంది. కొన్ని సందర్భాలలో చేప చర్మాన్ని ప్రాసెస్ చేసి.. సరికొత్త టెక్నాలజీతో గాయాలను మాన్పించే ఉత్పత్తులను తయారు చేసేందుకు పరిశోధనలు చేస్తున్నారు. మరోవైపు స్క్విడ్ అనే సముద్ర జీ మీద ఇటీవల ప్రయోగాలు చేశారు. దీని ఇంక్ భాగంలో అత్యధికంగా మెలనిన్ ఉంటుంది. దీన్ని ప్రాసెస్ చేసి మనుషుల్లో తలెత్తే అనేక రకాల రుగ్మతలకు మందుగా వాడేందుకు ప్రయోగాలు చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version