DTA Ugadi celebrations : అమెరికాలో 46 ఏళ్ల చరిత్ర ఉన్న డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ (డీటీఏ సంఘం) మన సాంస్కృతిక వారసత్వాన్ని పునరుద్దరించుకోవడానికి ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లు DTA ఉగాది ఉత్సవాలు ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అత్యంత అట్టహాసంగా నిర్వహించారు. శనివారము జరిగిన ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి 2200 మందికి పైగా హాజరయ్యారు. 300 పైగా ప్రతిభావంతులైన పిల్లలు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ప్రముఖ గాయని శ్రీమతి సునీత హాజరయ్యారు. ఆమె ఆధ్వర్యంలో మ్యూజికల్ లైవ్ కాన్సర్ట్ కుతోడు డీటీఏ ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంతో ఆకాశాన్ని అంటాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రచయిత, మాజీ రాజ్యసభ సభ్యులు, గౌరవనీయులు, పద్మశ్రీ పద్మభూషణ్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ హాజరయ్యారు. తెలుగుపైన ఉన్న అపారమైన అనుభవంతో భాష గొప్పతనాన్ని సాంస్కృతిక వారసత్వాన్ని వివరించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రేక్షకులకు ఉత్తేజాన్ని పంచారు. .

ఈ కార్యక్రమంలో అత్యంత ప్రతిభావంతులైన పిల్లలు తమ నాట్య, సంగీతాలతో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. గాయని సునీతను శాలువాతో తెలుగు ఆడపడుచులు సన్మానించారు. అనంతరం సునీత బృందం రాత్రి 7గంటల నుంచి రాత్రి 12 వరకు పాటలతో డిట్రాయిట్ ప్రేక్షకులను అలరించారు.
తెలుగు రుచులు జోడించి రుచికరమైన వంటలతో వచ్చిన వారందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరికి భోజనం అందేటట్లు డీటీఏ సంఘం చాలా జాగ్రత్తలు తీసుకుంది. వచ్చిన ప్రేక్షకులు ఏర్పాట్లు చూసి చాలా సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమానికి తానా బృందం అంజయ్య చౌదరి లావు, హనుమయ్య బండ్ల, సునీల్ పంత్ర, శ్రీనివాస్ గోగినేని, శ్రీని లావు, రాజా కాసుకుర్తి, ఠాగూర్ మల్లినేని, ఉమా అరమాండ్ల కటికి, జానీ నిమ్మలపూడి, నాగమల్లేశ్వర పంచుమర్తి హాజరయ్యరు. వీరితోపాటు డీటీఏ పూర్వ అధ్యక్షులు నీలిమ మన్నే, జోగేశ్వరరావు పెద్దిబోయిన, కోనేరు శ్రీనివాస్, వెంకట్ ఎక్క, రమణ ముద్దెగంటి, సుధీర్ బచ్చు, ద్వారకా ప్రసాద్ బొప్పన, సత్యం నేరుసు, సంతోష్ ఆత్మకూరి పాల్గొన్నారు. సభా వ్యాఖ్యాతగా ఉదయ్ చాపలమడుగు వ్యవహరించారు.

అంతేకాకుండా ప్రతీది సజావుగా జరిగేలా తెరవెనుక అవిశ్రాంతంగా పనిచేసిన ఈవెంట్ కోఆర్డినేటర్లు , వాలంటీర్ అయిన కుసుమ కళ్యాణి అక్కిరెడ్డి, సుబ్రత గడ్డం, అర్చన చావళ్ల, ప్రణీత్ నాని, తేజ్ కైలాష్ అంగిరేకుల, దీప్తి చిత్రపు, స్వప్న ఎల్లెందుల, శృతి బుసరి, రాజా తొట్టెంపూడి, సంజు పెద్ది వారికీ డీటీఏ హృదయపూర్వక అభినందనలు తెలియజేసింది.

ఈ సందర్బంగా కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు ఇది ఒక మినీ కన్వెన్షన్ ను తలపించేలా జరిగింది అంటూ కొనియాడారు. డీటీఏ అధ్యక్షుడు కిరణ్ దుగ్గిరాలను , డీటీఏ కార్యవర్గ సభ్యులను ప్రశంసించారు.